ధనియాలతో ఎన్నో లాభాలు ఉన్నాయో తెలుసా.!
ధనియాలు మన ఇంటి వంటింట్లో ఎప్పటినుంచో మసాలా దినుసుగా ఉపయోగంలో ఉన్నాయి. అయితే ఆయుర్వేదం ప్రకారం వీటిలో ఎన్నో ఔషధ గుణాలు కూడా ఉన్నాయి. ధనియాలను పలు ఆయుర్వేద ఔషధాల తయారీలోనూ, అలాగే వంటకాలకు రుచి, సువాసన కలిగించటానికి ఉపయోగిస్తారు. ఇవి కేవలం రుచికే కాకుండా ఆరోగ్యానికి కూడా చాలా ఉపయోగకరమని నిపుణులు చెబుతున్నారు. ధనియాల నీళ్లు తాగితే జీర్ణక్రియ మెరుగవుతుంది, గ్యాస్, అసిడిటీ, కడుపు ఉబ్బరం, మలబద్ధకం వంటి సమస్యలు తగ్గుతాయి.
ధనియాల నీళ్లు షుగర్ లెవల్స్ను తగ్గించడంలో సహాయపడతాయి. డయాబెటిస్ ఉన్నవారికి ఇవి ఉపయోగకరంగా ఉంటాయి. ఇవి ఇన్సులిన్ నిరోధకతను తగ్గించి, శరీరం ఇన్సులిన్ను సరిగా వినియోగించుకునేలా చేస్తాయి. అలాగే రోగ నిరోధక శక్తిని పెంచే యాంటీ ఆక్సిడెంట్లు ధనియాల్లో ఉంటాయి. వీటితో Seasonal వ్యాధులు వంటి జలుబు, దగ్గు త్వరగా తగ్గుతాయి.
గుండెకు కూడా మంచిది:
ధనియాల నీళ్లు గుండెను ఆరోగ్యంగా ఉంచుతాయి. చెడు కొలెస్ట్రాల్ను తగ్గించి, మంచి కొలెస్ట్రాల్ను పెంచుతాయి. హార్ట్ ఎటాక్ వచ్చే ప్రమాదం తగ్గుతుంది.
ఎప్పుడు తాగాలి:
బరువు తగ్గాలనుకునే వారు, లివర్ సమస్యలు, చర్మ వ్యాధులు ఉన్నవారికి కూడా ఇవి ఎంతో మేలు చేస్తాయి. ఇవి శరీరంలోని వాపులు, నొప్పులను తగ్గిస్తాయి. ఆర్థరైటిస్ ఉన్నవారికి కీళ్లకు బలాన్ని ఇస్తాయి. ధనియాల నీళ్లు మెదడును చురుకుగా ఉంచి, శరీరానికి ఉత్సాహాన్ని ఇస్తాయి. నిపుణుల ప్రకారం వీటిని రోజూ ఉదయం పాతిగా లేదా భోజనం చేసే 45 నిమిషాల ముందు తాగడం మంచిదని సూచిస్తున్నారు. రాత్రి ధనియాలను నీటిలో నానబెట్టి, మరుసటి రోజు ఆ నీటిని కొద్దికొద్దిగా తాగవచ్చు.
ఇలా కూడా తాగవచ్చు:
ధనియాలను నీటిలో మరిగించి కూడా ఈ నీటిని తాగవచ్చు. ఏ విధంగా చేసినా ధనియాల నీళ్లను తాగడం వల్ల అనేక ఆరోగ్య లాభాలను పొందవచ్చని వైద్యులు చెబుతున్నారు. అయితే అలర్జీలు ఉన్నవారు, గర్భిణీలు, పాలిచ్చే తల్లులు మాత్రం ధనియాల నీళ్లు తాగకూడదని సూచిస్తున్నారు.