యోగా దినోత్సవంలో యోగాంధ్ర-2025కి గిన్నిస్ రికార్డు !
By Ram Reddy
On
11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు నిర్వహించిన ఈ ఘన వేడుకలో 3 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొని చరిత్ర సృష్టించారు. దీనితో, 2023లో గుజరాత్లోని సూరత్లో జరిగిన యోగా కార్యక్రమం (1,53,000 మంది పాల్గొన్నది) సృష్టించిన రికార్డును యోగాంధ్ర అధిగమించింది. లక్షలాది మంది ఒకే సమయంలో, ఒకే మార్గంలో యోగాసనాలు వేసి ఈ అరుదైన ఘనతను సాధించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విజయంతో దేశానికి గర్వకారణంగా నిలిచింది.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...