యోగా దినోత్సవంలో యోగాంధ్ర-2025కి గిన్నిస్ రికార్డు !

యోగా దినోత్సవంలో యోగాంధ్ర-2025కి గిన్నిస్ రికార్డు !

11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన యోగాంధ్ర-2025 కార్యక్రమం గిన్నిస్ వరల్డ్ రికార్డును సొంతం చేసుకుంది. విశాఖపట్నంలోని రామకృష్ణ బీచ్ నుంచి భీమిలి వరకు నిర్వహించిన ఈ ఘన వేడుకలో 3 లక్షల మందికిపైగా ప్రజలు పాల్గొని చరిత్ర సృష్టించారు. దీనితో, 2023లో గుజరాత్‌లోని సూరత్‌లో జరిగిన యోగా కార్యక్రమం (1,53,000 మంది పాల్గొన్నది) సృష్టించిన రికార్డును యోగాంధ్ర అధిగమించింది. లక్షలాది మంది ఒకే సమయంలో, ఒకే మార్గంలో యోగాసనాలు వేసి ఈ అరుదైన ఘనతను సాధించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని మరింత వైభవంగా మార్చిన ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఈ విజయంతో దేశానికి గర్వకారణంగా నిలిచింది.

Tags:

About The Author

Latest News