వైష్ణోదేవి కొత్త ట్రెక్కింగ్ రూట్లో విరిగిన కొండచరియలు
జమ్మూకశ్మీర్, జూన్ 26: ప్రసిద్ధి గాంచిన మాతా వైష్ణో దేవి ఆలయంకి వెళ్లే కొత్త ట్రెక్కింగ్ మార్గంలో ఇవాళ ఉదయం భారీ కొండచరియలు విరిగిపడటంతో భక్తుల యాత్రకు తాత్కాలికంగా అంతరాయం ఏర్పడింది. ఈ ఘటన రియాసీ జిల్లాలోని త్రికూట పర్వతాల్లో చోటు చేసుకుంది.హిమకోటి మార్గంలో ఉన్న 'సత్యా వ్యూ పాయింట్' వద్ద భారీ కొండచరియలు పడడంతో కొత్త ట్రాక్ను అధికారులు తాత్కాలికంగా మూసివేశారు. గత కొన్ని రోజులుగా అక్కడ ఎడతెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండటమే దీనికి కారణంగా చెబుతున్నారు.బ్యాటరీ కార్లు, హెలికాప్టర్ సేవలు కూడా నిలిపివేయబడ్డాయి. అంతేకాదు, భైరవ్ ఆలయానికి వెళ్లే మార్గంలోనూ కొండచరియలు విరిగిపడినట్లు అధికారులు తెలిపారు. ప్రస్తుతం రెండు ట్రాక్లపై పడిన రాళ్లను తొలగించేందుకు సిబ్బంది సహాయ చర్యలు చేపట్టారు.ఇకపోతే, పాత ట్రాక్ ద్వారా భక్తుల యాత్ర సజావుగానే సాగుతోంది అని అధికారులు హామీ ఇచ్చారు. భక్తులు ప్రస్తుతానికి కొత్త మార్గాన్ని ఉపయోగించవద్దని సూచించారు.అగ్నిప్రమాదాలు, విపత్తులకు తగిన విధంగా రెస్క్యూ టీమ్లు అప్రమత్తంగా ఉన్నాయని తెలుస్తోంది. వర్షాలు కొనసాగే అవకాశం ఉన్న నేపథ్యంలో భక్తులు అప్రమత్తంగా ఉండాలని సూచించారు.