సీబిఎస్ఈ పదోతరగతి పరీక్షలు రెండుసార్లు.......
లోకల్ గైడ్:న్యూఢిల్లీ: సీబీఎస్ఈ (CBSE) పదో తరగతి విద్యార్థుల కోసం 2026 విద్యా సంవత్సరం నుంచి ఒక కొత్త పరీక్షా విధానాన్ని అమలు చేయనుంది. నూతన విద్యా విధానం (NEP) సిఫార్సుల మేరకు, బోర్డు పరీక్షలను ఏడాదిలో రెండుసార్లు నిర్వహించాలని నిర్ణయించింది.
-
మొదటి దశ పరీక్షలు ఫిబ్రవరిలో,
-
రెండో దశ పరీక్షలు మే నెలలో జరగనున్నాయి.
-
ఫలితాలను వరుసగా ఏప్రిల్ మరియు జూన్ నెలల్లో విడుదల చేస్తారు.
భరద్వాజ్ వివరించినట్టు, మొదటి దశ పరీక్షలు తప్పనిసరిగా అందరూ రాయాలి. అయితే రెండో దశ పరీక్షలు ఎంపిక ఆధారితమైనవి. అంటే, మొదటి దశలో తక్కువ మార్కులు వచ్చిన విద్యార్థులు తమ మార్కులను మెరుగుపర్చుకోవాలనుకుంటే, సామాన్య శాస్త్రం, గణితం, సాంఘిక శాస్త్రం, భాషలపై ఏవైనా మూడు సబ్జెక్టుల రెండో దశ పరీక్షలు రాయవచ్చు.ఇకపై సప్లిమెంటరీ పరీక్షల అవసరం ఉండదని, మేలో జరిగే రెండో దశ పరీక్షలనే పునరుత్తీర్ణ పరీక్షలుగా పరిగణిస్తామని సీబీఎస్ఈ ఛైర్మన్ రాహుల్ సింగ్ స్పష్టం చేశారు.ఈ కొత్త విధానం వల్ల విద్యార్థులకు మరో అవకాశం లభించడంతో పాటు, ఒత్తిడి తగ్గే అవకాశం ఉంది.