ఛత్తీస్‌గఢ్‌లో 13 మంది మావోయిస్టులు లొంగిపాటు

ఛత్తీస్‌గఢ్‌లో 13 మంది మావోయిస్టులు లొంగిపాటు

ఛత్తీస్‌గఢ్ రాష్ట్రం బీజాపూర్ జిల్లాలో 13 మంది మావోయిస్టులు లొంగిపోయారు. లొంగిపోయినవారిలో 8 మంది మహిళలు ఉన్నారని అధికారులు తెలిపారు. వీరిపై మొత్తం రూ. 23 లక్షల రివార్డు ఉన్నట్లు తెలుస్తోంది.‘ఆపరేషన్ కగార్’ ద్వారా మావోయిస్టులకు తీవ్ర దెబ్బతగులుతుందని అధికారులు పేర్కొన్నారు. ఇటీవల జరిగిన ఎన్‌కౌంటర్లలో కీలక మావోయిస్టు నేతలు మృతిచెందారు. ఈ పరిణామాల నేపథ్యంలో కొందరు మావోయిస్టులు అజ్ఞాతం వీడి, పోలీసుల ముందు లొంగిపోతున్నారు.లొంగిపోయిన వారికి ప్రభుత్వ నిబంధనల ప్రకారం పునరావాసం కల్పిస్తామని అధికారులు స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News