మాతృభాషల్లో నీట్కు మోస్తరే స్పందన – ఇంగ్లిష్దే ప్రాధాన్యం
హైదరాబాద్: ప్రాంతీయ భాషల్లో నీట్ పరీక్షకు విద్యార్థుల నుండి గణనీయమైన స్పందన కనిపించడం లేదు. ఇంగ్లిష్తోపాటు 13 ప్రాంతీయ భాషల్లో పరీక్ష నిర్వహణకు అవకాశం కల్పిస్తున్నా, ఎక్కువ మంది విద్యార్థులు ఇంగ్లిష్ మీదే ఆసక్తి చూపుతున్నారు.2019 నుండి నీట్ పరీక్షను ఇంగ్లిష్, హిందీతో పాటు అస్సామీ, బెంగాళీ, గుజరాతీ, కన్నడ, మరాఠీ, మలయాళం, ఒడియా, తమిళ్, తెలుగు, ఉర్దూ భాషల్లోనూ నిర్వహిస్తుండగా, ఈసారి దాదాపు అన్ని ప్రాంతీయ భాషల్లో దరఖాస్తుల సంఖ్య తగ్గింది.మొత్తం 22.09 లక్షల మంది దరఖాస్తు చేసుకోగా, వీరిలో 18.22 లక్షల మంది ఇంగ్లిష్లోనే పరీక్ష రాయడానికి ఎంచుకున్నారు. తెలుగులో పరీక్ష రాయాలనుకునేవారి సంఖ్య చాలా తక్కువగా ఉంది. 2019 నుండి 2025 వరకు తెలుగులో దరఖాస్తులు ఎప్పుడూ 2 వేలను దాటలేదు. 2019లో 700 మంది దరఖాస్తు చేసుకోగా, 2020లో అత్యధికంగా 1,624 మంది దరఖాస్తు చేశారు. ఇది రికార్డు సంఖ్య. ఈసారి దరఖాస్తులు 907కి తగ్గాయి.