అవి సంకేతాలు కావు.....

అవి సంకేతాలు కావు.....

శశి థరూర్ రాసిన వ్యాసాన్ని ప్రధానమంత్రి కార్యాలయం సోమవారం ఎక్స్‌లో (మునుపటి ట్విట్టర్) షేర్ చేసింది. ఆ వ్యాసంలో థరూర్, మోదీ ప్రభుత్వ విదేశాంగ విధానాన్ని తప్పుబడుతున్న కాంగ్రెస్ విమర్శలకు విరుద్ధంగా, భారతం ఏకాకిగా ఉందన్న అభిప్రాయాన్ని కొట్టిపారేశారు.‘ఆపరేషన్ సిందూర్’ తరువాత దేశం తీసుకున్న దౌత్యపరమైన చొరవలు, జాతీయ సంకల్పాన్ని, ప్రభావవంతమైన ప్రతినిధిత్వాన్ని స్పష్టంగా చూపిస్తున్నాయని ఆయన పేర్కొన్నారు. పహల్గాం ఉగ్రదాడి అనంతరం భారత్ చూపించిన క్రమపద్ధతైన చర్యలు, ఆపరేషన్ సిందూర్ ద్వారా భారత్ ఘనమైన ప్రతిస్పందన ఇచ్చిందని వివరించారు. ఈ పరిణామాలు మన విదేశాంగ విధానానికి ఒక కీలక మలుపు అని ఆయన అభిప్రాయపడ్డారు.మొత్తానికి, కాంగ్రెస్ విమర్శలను ఖండిస్తూ థరూర్ వ్యాసంలో భారత్ గ్లోబల్ స్టేజీలో నిబద్ధతను, ధైర్యాన్ని నిరూపించిందని స్పష్టంగా వివరించడం విశేషం.

Tags:

About The Author

Latest News