పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత

పూరీ రథయాత్రలో భక్తుల ఉత్సాహం… 600 మందికి పైగా అస్వస్థత

లోక‌ల్ గైడ్ :

ఒడిశా పూరీలోని జగన్నాథ రథయాత్ర అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. ‘జై జగన్నాథ’ నినాదాలతో పూరీ నగర వీధులు మార్మోగాయి. ఈ మహోత్సవాన్ని ప్రత్యక్షంగా దర్శించేందుకు దేశం నలుమూలల నుంచి లక్షలాది భక్తులు తరలివచ్చారు.

అయితే, అధిక వేడి, ఉక్కపోత, రద్దీ కారణంగా అనేకమంది భక్తులు అస్వస్థతకు గురయ్యారు. శుక్రవారం జరిగిన రథయాత్రలో సుమారు 625 మంది భక్తులు అస్వస్థతతో ఆసుపత్రులకు తరలించబడ్డారని అధికారులు తెలిపారు. రథాలను లాగేందుకు భక్తులు పోటీపడ్డ సమయంలో కొందరికి స్వల్ప గాయాలు కూడా అయ్యాయి.అయినప్పటికీ ప్రాథమిక చికిత్స తర్వాత చాలామంది డిశ్చార్జ్ అయ్యారు. సంతోషకరంగా, ఈ కార్యక్రమంలో ఏవైనా ప్రాణ నష్టాలు జరగలేదని అధికారులు స్పష్టం చేశారు.రథయాత్రకు ఒడిశా గవర్నర్ హరిబాబు కంభంపాటి, ముఖ్యమంత్రి మోహన్ చరణ్ మాఝీ హాజరై, జగన్నాథుడు, సుభద్రా, బలభద్రుల రథాలను లాగి ప్రత్యేక పూజలు చేశారు.


Tags:

About The Author

Latest News