ఏసీబీ విచారణకు హాజరైన కేటీఆర్
By Ram Reddy
On
లోకల్ గైడ్:
హైదరాబాద్: ఫార్ములా-ఈ కారు రేసింగ్ కేసు సంబంధంగా భారాస కార్యనిర్వాహక అధ్యక్షుడు కేటీఆర్ (KTR) ఏసీబీ విచారణకు హాజరయ్యారు. ఈ కేసులో ఆయన ప్రధాన ఆరోపణలపై ఏ1గా ఉన్నారు. ప్రభుత్వ అనుమతులు లేకుండా విదేశీ సంస్థకు నగదు చెల్లించినట్టు ఆయనపై ఆరోపణలు ఉన్నాయి. ఈ ఏడాది జనవరిలోనూ కేటీఆర్ ఏసీబీ ముందు హాజరైన విషయం తెలిసిందే.
విచారణ సందర్భంగా ఏసీబీ కార్యాలయం వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసుల భారీ బందోబస్తు మధ్య బారికేడ్లు ఏర్పాటు చేసి ఎవరికీ ప్రవేశం అనుమతించడం లేదు. కేటీఆర్కు అటూర్నీ రామచందర్రావు తోడుగా వచ్చారు. కేటీఆర్ను ఏసీబీ జాయింట్ డైరెక్టర్ రితురాజ్, డీఎస్పీ మాజీఖాన్ విచారిస్తున్నారు. ఈ కేసు దర్యాప్తు బాధ్యతలను మాజీదాఖాన్ భుజాన వేసుకున్నారు.
ఇక తెలంగాణ భవన్లో మాజీ మంత్రి హరీశ్ రావు న్యాయవాదులతో భేటీ అయ్యారు. కేటీఆర్పై ఏసీబీ విచారణ జరుగుతున్న నేపథ్యంలో దీనికి సంబంధించి న్యాయపరమైన అంశాలపై చర్చించినట్లు తెలుస్తోంది. భారాస నేత ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ సహా మరికొంత మంది నేతలు కూడా ఈ సమావేశంలో పాల్గొన్నారు.
Tags:
About The Author
Latest News
28 Jun 2025 17:51:24
జాతీయ స్థాయి గౌరవాలు, సేవలో నిబద్ధతకు గుర్తింపు*
*-గౌరవ హానరీ డాక్టరేట్, సేవా రత్న నేషనల్ అవార్డు ప్రదానం*
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): సామాజిక సేవ...