“కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే.......

 “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే.......

లోక‌ల్ గైడ్,కాకినాడ:  వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిజమైన ఉద్యమం చేయదని, జగన్‌కి ఉపయోగపడే కార్యక్రమాలే చేస్తుందని ఏపీ కాంగ్రెస్ అధ్యక్షురాలు వైఎస్ షర్మిల విమర్శించారు. కాకినాడలో ఆమె మీడియాతో మాట్లాడుతూ, “కాంగ్రెస్ ఒక మహాసముద్రం. పిల్లకాలువలన్నీ సముద్రంలో కలవాల్సిందే. పార్టీలో సీనియర్లు నిరుత్సాహంగా లేరు, వర్గపోరు లేదు. అందరం కలిసే పనిచేస్తున్నాం. ఏవైనా సమస్యలు ఉంటే వెంటనే పరిష్కరిస్తాం. పార్టీ బలోపేతం కోసమే జిల్లాల పర్యటనలు చేస్తున్నాం,” అని అన్నారు.అలాగే, “ప్రజల పక్షాన పోరాటాలు ముమ్మరం చేస్తాం. ఈ రాష్ట్రంలో భాజపాను ఎదిరించే శక్తి కాంగ్రెస్‌కి మాత్రమే ఉంది” అని షర్మిల స్పష్టం చేశారు.

Tags:

About The Author

Latest News