విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్

విశాఖలో కొత్త ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేస్తున్న కాగ్నిజెంట్

– 8 వేల ఉద్యోగాలు కలిసే అవకాశాలు

లోక‌ల్ గైడ్ అమరావతి: ప్రముఖ ఐటీ సంస్థ కాగ్నిజెంట్ (Cognizant) విశాఖపట్నంలో నూతనంగా ఐటీ క్యాంపస్‌ను ఏర్పాటు చేయనున్నట్లు ప్రకటించింది. ఈ విషయాన్ని సంస్థ అధికారికంగా సోషల్ మీడియా ప్లాట్‌ఫాం ‘ఎక్స్’ (లేదా పూర్వపు ట్విట్టర్) ద్వారా వెల్లడించింది.కాగ్నిజెంట్ తెలిపిన వివరాల ప్రకారం, విశాఖపట్నం కాపులుప్పాడలో 22 ఎకరాల విస్తీర్ణంలో ఈ క్యాంపస్ నిర్మాణం జరగనుంది. కొత్త క్యాంపస్ ద్వారా సుమారు 8,000 మందికి ఉద్యోగావకాశాలు లభించనున్నాయి.ప్రత్యేకంగా కృత్రిమ మేధస్సు (AI), డిజిటల్ ట్రాన్స్ఫర్మేషన్ వంటి విభాగాల్లో ఉద్యోగాలు కలుగుతాయని కంపెనీ వెల్లడించింది. ఈ క్యాంపస్‌ 2026 నుంచి కార్యకలాపాలు ప్రారంభించనుందని పేర్కొంది. ఈ ప్రాజెక్టు సాధ్యపడటానికి తోడ్పడినందుకు రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేశ్‌ కు సంస్థ కృతజ్ఞతలు తెలిపింది.

Tags:

About The Author

Latest News