కంటి పరీక్ష శిభిరం ప్రారంభించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారినీ డా. K. V. స్వరాజ్య లక్ష్మి

కంటి పరీక్ష శిభిరం ప్రారంభించిన జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారినీ డా. K. V. స్వరాజ్య లక్ష్మి

లోకల్ గైడ్, నాగర్ కర్నూల్

జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ద్వారా నాగర్ కర్నూల్ డివిజన్ కార్యాలయంలో గురువారం నాడు నిర్వహించిన ప్రత్యేక కంటి చికిత్స శిబిరంలో 122 మందిని పరీక్షించగా 46 మందికి కంటిపోర, క్యాటరక్ట్ ఉన్నట్లు గుర్తించి ప్రత్యేక అంబులెన్స్ లో ప్రత్యేక అంబులెన్స్ ద్వారా ఏనుగొండలోని లయన్ రామిరెడ్డి కంటి ఆసుపత్రికి పంపినట్లు డా. K. V. స్వరాజ్యలక్ష్మి గారు తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కంటిలో వచ్చే చిన్న చిన్న సమస్యలను పట్టించుకోకుండా అవి పెద్దవి అయ్యే విధంగా చేసుకోవద్దని వెంటనే డాక్టర్ను సంప్రదించి చికిత్స చేయించుకుంటే ఎలాంటి ఇబ్బంది జరగదని లేకపోతే ఇలా ఆపరేషన్లు చేయించుకోవలసి వస్తుందని సమస్య చిన్నగా ఉన్నప్పుడే చూపించుకుంటే బాగుంటుందని తెలిపారు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన 125 రోగులకు ప్రత్యేకంగా సాధారణ మరియు కంటి పరీక్షలు నిర్వహించినట్లు ఆమె తెలిపారు అందులో కంటి దృష్టి సమస్య, గుర్తించినట్లు వారికి చికిత్స నిమిత్తం ఏనుగొండ పంపించినట్లు తెలియజేశారుఅందరికీ ఉచితంగా కంటి ఆపరేషన్ నిర్వహించి ,నల్లని అద్దాలు,మందులు ఇవ్వనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డి.ఎమ్.ఎచ్.ఓ. డా. వెంకట్ దాస్ , జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డా. రవి కుమార్ నాయక్ ఆప్తాలమిక్ అధికారి కొట్ర బాలాజీ, , డి.వి.ఎల్.ఎమ్. కుమార్, ఆర్ .శ్రీను, సురేష్ , ప్రకాష్, రమేష్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News