మొక్కలు నాటండి పర్యావరణాన్ని కాపాడుకోండి

బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంకనోళ్ల వెంకటేష్" 

జనసంఘ్ వ్యవస్థాపకులు డా. శ్యామప్రసాద్ ముఖర్జీకి ఘనంగా నివాళులు

ఎలికట్ట గ్రామములో  మొక్కలు నాటిన బీజేపీ నాయకులు

స్వతంత్ర సమర యోధుడు అఖండ భారతాని కోసం ప్రాణాలు అర్పించిన భారత మాత ముద్దుబిడ్డ బీజేపీ పూర్వపు జనసంఘ్ వ్యవస్థాపకులు డా" శ్యామాప్రసాద్ ముఖర్జీ బలిదివాస్ సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ  ఎలికట్ట గ్రామములో బూత్ కమిటీ అద్యక్షులు కొడవటి నర్సింలు ఆధ్వర్యంలో మొక్కలు నాటడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముక్య అతిథిగా బీజేపీ ఎస్సీ మోర్చ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎంకనోళ్ల వెంకటేష్ పాల్గొన్నారు. కార్యక్రమంలో గ్రామానికి చెందిన బీజేపీ నాయకులు శివకుమార్ బీజేపీ ఫరూక్ నగర్ మండల కార్యదర్శి,గోనెల రాము, యాదగిరి,శ్రీనివాస్, తదితరులు ఉన్నారు ఎంకనోళ్ల వెంకటేష్ "ఈ సందర్భంగా మాట్లాడుతూ బీజేపీ పూర్వపు జనసంఘ్ వ్యవస్థాపకులు డాక్టర్ శ్యామప్రసాద్ ముఖర్జీ వర్ధంతి సందర్భంగా ఆయనకు నివాళులు అర్పిస్తూ ఎలికట్ట గ్రామములో బీజేపీ నాయకులతో కలిసి మొక్కలు నాటడం జరిగింది అని
అఖండ భారతావని కోసం ప్రాణాలు అర్పించిన గొప్ప జాతీయ వాది శ్యామ ప్రసాద్ ముఖర్జీ అని, ఆయన కన్న కలలు నేడు భారత ప్రధాని శ్రీ నరేంద్రమోదీ గారు నెరవేరుస్తున్నారని తెలిపారు ఆయన వర్ధంతి నీ పురస్కరించుకొని మొక్కలు నాటడం చాలా సంతోషకరమని, మొక్కలు నాటడం వల్ల పర్యావరణాన్ని కాపాడుకోవచ్చు అని,రోజు రోజుకు చెట్లు అంతరిస్తున్న ప్రస్తుత పరిస్థితుల్లో మొక్కలు నాటే కార్యక్రమం చాలా మంచి కార్యక్రమం అని పేర్కొన్నారు. పర్యావరణాన్ని కాపాడు కోవాల్సిన బాధ్యత మన అందరిపైనా ఉందని ప్రతి ఒక్కరూ పది మొక్కలు నాటాలని ఆయన పిలుపునిచ్చారు.

Tags:

About The Author

Latest News