పోలీస్ డ్యూటీ మీట్ కార్యక్రమం...
.విధి నిర్వహణలో విభిన్న రకాల పరీక్షల నిర్వహణ...
నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) పోలీస్ విధినిర్వహణలో సామర్థ్యం పెంచడానికి తెలంగాణా రాష్ట్రంలో రెండవ పోలీస్ డ్యూటీ మీట్ నిర్వహణలో భాగంగా నిజామాబాద్ పోలీస్ కమీషనరేట్ లో వివిధ రంగాలలో పోటీలు నిర్వహించారు.ఈ పోటీల ద్వారా పోలీస్ విభాగంలో కానిస్టేబుల్ స్థాయి నుండి ఎ.సి.పి స్థాయి వరకు పని పద్దతులు మెరుగుపడి ఇన్వేస్టిగేషన్ స్థాయిలు పెరుగుతాయి, పనిలో పోటీతత్వం అలవాటుపడుతుందనీ అన్నారు. సైంటిఫిక్ ఇన్వేస్టిగేషన్, ఫింగర్ ప్రింట్ ఇన్వేస్టిగేషన్ కోసం ఎంపికలో భాగంగా శుక్రవారం నిజామాబాద్ పోలీస్ కమీషనరేటులో నేరాలు జరిగినప్పుడు అట్టి నేర స్థలంలో సేకరించవలసిన నేర సమాచారం కోసం పోలీస్ క్లూస్ ఏ విధంగా సేకరించాలనేదని కోసం ఎంపిక పరీక్షలు నిర్వహించడం జరిగిందన్నారు.ఇందులో భాగంగా పోలీస్ కమాండ్ కంట్రోల్ కార్యలయంలో నిజామాబాద్ పోలీస్ కమిషనర్ పి.సాయి చైతన్య సమక్షంలో సి.ఐలు, ఎస్.ఐలు మరియు సిబ్బందికి ఎంపిక పరీక్షలు ప్రారంభించారు. ఇందులో ఫోరన్సిక్ సైన్స్ ఫింగర్ ప్రింట్, లిఫ్టింగ్ మరియు ప్యాకింగ్, ఐ.ఓ ఫోటో గ్రాఫి , వీడియోగ్రాఫీల కోసం ఎంపికలు నిర్వహించారు..ఎ.ఎస్.ఐ నుండి కానిస్టేబుల్ వరకు వారి అబ్జర్వేషన్ పని తీరును మెరుగుపర్చడం, పరీక్షించడం అబ్జర్వేషన్ పరీక్ష, నిందితులను గుర్తించే పరీక్షలు నిర్వహించారు.ఇందులో మంచి ప్రతిభ కనబర్చిన వారిని రాష్ట్ర స్థాయిలో జరిగే డ్యూటీ మీట్ కార్యాక్రమానికి పంపడం జరుగుతుందన్నారు. ఈ కార్యాక్రమంలో నిజామాబాద్ అదనపు డి.సి.పి (అడ్మిన్) బస్వా రెడ్డి, సి.సి.ఎస్. ఎ.సి.పి నాగవేంద్ర చారీ, CCRB ఏసీపీ రవీందర్ రెడ్డి, సి.ఐలు, ఎస్.ఐలు తదితరులు పాల్గొన్నారు.