ఎంజేపీ గురుకులంలో మాదిరి ఎన్నికల నిర్వహణ

ఎంజేపీ గురుకులంలో మాదిరి ఎన్నికల నిర్వహణ

లోక‌ల్ గైడ్, రంగారెడ్డి, చేవెళ్ల :

మహాత్మ జ్యోతిబాపూలే గురుకుల పాఠశాల, కళాశాల విద్యార్థుల్లో ప్రజాస్వామ్య భావన రావడం కోసం భారత ప్రభుత్వ ఎన్నికల విధానాన్ని అనుసరిస్తూ,అవి ఏ విధంగా నిర్వహించబడతాయో పూర్తి అవగాహన కలిగించే విధంగా సాంఘిక శాస్త్ర విభాగం వారి ఆధ్వర్యంలో స్కూలు మరియు కళాశాల స్థాయిలో విద్యార్థి నాయకులను ( సిపిఎల్,ఎస్పిఎల్)ఎన్నికల ద్వారా ఎన్నుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఎన్నికల ముఖ్య అధికారిగా ప్రిన్సిపాల్  జంగం నరేష్ పాల్గొన్నారు. వారు మాట్లాడుతూ నేటి బాలలు రేపటి పౌరులు పారదర్శకమైన నీతి నిజాయితీ కలిగిన వారిని ఎన్నుకోవడం ద్వారా మెరుగైన సమాజాన్ని నిర్మించుకోగలుగుతామని విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఏటీపీ లింగస్వామి, పీడీ శ్రీనివాస్,పిఓ గణేష్, ఉపాధ్యాయులు, రమేశ్, నాందేవ్, మణిమాల,కృష్ణవేణి, నిర్మల, అస్మా, సుమలత,భాస్కర్,  విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News