మంచినీరు, డ్రైనేజీ సమస్యలు తెలెత్తకుండా చర్యలు
కార్పొరేటర్ రాగం..నాగేందర్ యాదవ్
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి డివిజన్ లోని కాలనీలల్లో, బస్తీలలో డ్రైనేజీ సమస్యలపై జలమండలి అధికారులు వాటర్ వర్క్స్ జనరల్ మేనేజర్ కృష్ణ వారి బృందంతో కలిసి ప్రత్యేక సమావేశంలో పాల్గొన్న శేరిలింగంపల్లి కార్పొరేటర్ రాగం నాగేందర్ యాదవ్. ఈ సందర్భంగా కార్పొరేటర్ మాట్లాడుతూ..పొంగుతున్న డ్రైనేజీలకు వెంటనే మరమ్మతులు చేపట్టాలన్నారు. అధికారులు, వివిధ శాఖలతో అధికారులతో కలిసి ఒకరికోకరు సమన్వయంతో పని చేయాలని, ప్రజలకు ఎల్లప్పుడు అందుబాటులో ఉండి వారి సమస్యలు పరిష్కరించేందుకు అందరూ కృషి చేయాలని సూచించారు. పాపిరెడ్డి నగర్, హెచ్ఏఎల్ కాలనీ, పలు బస్తీలలో నెలకొన్న డ్రైనేజీ సమస్యలపై వినతిపత్రం అందజేశారు. అందుకు జిఎం కృష్ణ స్పందిస్తూ కార్పొరేటర్ ఆదేశాల మేరకు డివిజన్ లో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో వాటర్ వర్క్స్ డిజిఎం నరేందర్ రెడ్డి, మేనేజర్ అభిషేక్ రెడ్డి, మేనేజర్ సందీప్ రెడ్డి, పాపిరెడ్డి నగర అధ్యక్షులు కొండల్ రెడ్డి, వార్డ్ మెంబర్ రాంబాబు, కొయ్యాడ లక్ష్మణ్ యాదవ్, హెచ్ఏఎల్ కాలనీ ప్రెసిడెంట్ పరశురామ్, లింగారెడ్డి, కొండల్ రెడ్డి, కుమార్, సిద్దయ్య, శ్రీనివాస్ రెడ్డి, శంకర్, నరేందర్, ప్రవీణ్, తదితరులు పాల్గొన్నారు.