ప్రజావాణికి (73 ) ఫిర్యాదులు
లోకల్ గైడ్, రంగారెడ్డి: ప్రజావాణిలో వచ్చిన దరఖాస్తులను పెండింగ్ పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్ అధికారులనుఆదేశించారు.సోమవారం సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో నిర్వహించిన
ప్రజావాణి కార్యక్రమానికి జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు అందజేసిన అర్జీలను జిల్లా అదనపు కలెక్టర్ ప్రతిమ సింగ్,జిల్లా రెవెన్యూ అధికారి సంగీతతో కలసి స్వీకరించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ ప్రజా సమస్యల సత్వర పరిష్కారం
కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమంలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి తమ సమస్యల పరిష్కారానికై ప్రజలు అందించే వినతులను సంబంధిత శాఖల జిల్లా అధికారులు తక్షణమే స్పందిస్తూ పరిష్కరించాలని ఆదేశించారు.అర్జీలను పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు.రెవెన్యూ శాఖ –32, ఇతర శాఖలకు –41, మొత్తం 73 దరఖస్తులు అందాయి. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు, మున్సిపల్ అధికారులు,మండల తహశీల్దారులు, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు, సంబంధిత అధికారులు,తదితరులు పాల్గొన్నారు.