. మీకో దండం… మీ పార్టీకో దండం’’......

. మీకో దండం… మీ పార్టీకో దండం’’......

లోక‌ల్ గైడ్: భారతీయ జనతా పార్టీ (బీజేపీ) తెలంగాణ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపిక ఆ పార్టీలో కలకలం సృష్టిస్తోంది. అధ్యక్ష పదవికి పోటీచేసి నిరాశ చెందిన గోషామహల్ ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన నిర్ణయం తీసుకున్నారు. ఆయన బీజేపీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. తన రాజీనామా లేఖను కేంద్రమంత్రి కిషన్‌రెడ్డికి పంపినట్లు తెలిపారు.ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడిన రాజాసింగ్, తన రాజీనామాను ఆమోదించాలని కిషన్‌రెడ్డిని కోరినట్లు చెప్పారు. రాష్ట్ర అధ్యక్ష పదవికి నామినేషన్ వేయకుండా అడ్డుకున్నారని, నామినేషన్ వేసే సమయంలో తన మద్దతుదారులను కొందరు బెదిరించారని ఆరోపించారు. జాతీయ కౌన్సిల్ సభ్యులు కూడా మద్దతు ఇవ్వకుండా బెదిరించారని విమర్శించారు. ‘‘పార్టీలో ఉండాలా? సస్పెండ్ చేయాలా? అని బెదిరించారు. నామినేషన్ పత్రాలపై సంతకాలు చేయనివ్వలేదు. పదిమంది మద్దతుదారులు సిద్ధంగా ఉన్నప్పటికీ, సంతకాలు చేయకుండా అడ్డుకున్నారు’’ అని ఆవేదన వ్యక్తం చేశారు.రామచందర్‌రావుకు అధ్యక్ష పదవి ఇవ్వడంపై కార్యకర్తల్లో అసంతృప్తి ఉందని, 2014 నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొన్నట్టు రాజాసింగ్ చెప్పారు. బీజేపీ ఎవరికి అధ్యక్ష పదవి ఇవ్వాలో ముందే నిర్ణయించిందని, తాను పార్టీ సింబల్‌పై ఎమ్మెల్యేగా గెలిచానని, తన రాజీనామా లేఖను కిషన్‌రెడ్డికి అందజేశానని తెలిపారు. స్పీకర్‌కు కూడా ఈ లేఖను కిషన్‌రెడ్డే పంపించాలని కోరారు.‘‘పార్టీ కోసం అన్ని త్యాగాలు చేశాను. ఉగ్రవాదులు టార్గెట్‌గా పెట్టారు. మీకో దండం… మీ పార్టీకో దండం’’ అని వ్యాఖ్యానించిన రాజాసింగ్, బీజేపీకి రాజీనామా చేసినా హిందుత్వం కోసం తన పోరాటం కొనసాగిస్తానని స్పష్టం చేశారు. తెలంగాణలో బీజేపీ అధికారంలోకి రావకుండా ఆ పార్టీ నేతలే అడ్డుపడుతున్నారని ఆయన తీవ్ర విమర్శలు చేశారు.

Tags:

About The Author

Latest News