ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ 

ప్రజావాణికి ఫిర్యాదుల వెల్లువ 

 ప్రజా ఫిర్యాదు లను సత్వరమే పరిష్కరించాలి :

వికారాబాద్ జిల్లా కలెక్టర్ ప్రతీక్ జైన్

వికారాబాద్ జిల్లా, లోకల్ గైడ్:

 ప్రజా సమస్యల సత్వర పరిష్కారం కోసం నిర్వహిస్తున్న ప్రజావాణి కార్యక్రమానికి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అర్జీలకు ప్రాధాన్యతనిస్తూ ఫిర్యాదులను వెంటవెంటనే పరిష్కరించాలని ఈ సందర్భంగా కలెక్టర్  అధికారులను ఆదేశించారు. సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయ సమావేశ మందిరంలో సోమవారం నిర్వహించిన ప్రజావాణి కార్యక్రమానికి 185  ఫిర్యాదులు వచ్చాయని తెలిపారు.జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వచ్చిన ఫిర్యాదుదారులు తమ సమస్యలను కలెక్టర్ కు విన్నవిస్తూ  భూ సమస్య లు, పెన్షన్ లకు సంబందించి  ఫిర్యాదు లు సమర్పించారు.  ప్రజా ఫిర్యాదులను  సంబంధిత అధికారులు పెండింగ్ లో పెట్టకుండా ఎప్పటికప్పుడు పరిశీలన జరుపుతూ, సమస్యలను పరిష్కరించాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. ఫిర్యాదులపై చేపట్టిన చర్యలను వివరిస్తూ ఫిర్యాదు దారులకు సమాచారం తెలియజేయాలని సూచించారు. 
ఈ ప్రజావాణి కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ లు లింగ్యా నాయక్, సుధీర్, ఆర్ డి ఓ వాసు చంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు, సెక్షన్ సూపరింటెండెంట్స్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News