తెలంగాణ బీజేపీ అధ్యక్షుడిగా ఆయన పేరు ఖరారు........
లోకల్ గైడ్: హైదరాబాద్: తెలంగాణ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి ఎంపికపై నెలకొన్న ఉత్కంఠకు తెరపడింది. ఈ పదవికి మాజీ ఎమ్మెల్సీ రామచందర్ రావు పేరును పార్టీ అధిష్టానం ఖరారు చేసింది. ఈ మేరకు ఆయనను నామినేషన్ వేయాలని ఆదేశించగా, మధ్యాహ్నం 2 గంటలకు రామచందర్ రావు నామినేషన్ దాఖలు చేయనున్నారు.తెలంగాణ రాష్ట్ర అధ్యక్ష పదవికి ఎంపిక ప్రక్రియలో బీజేపీ అగ్రనేతలు తీవ్రంగా చర్చలు జరిపారు. ఎంపీలు ఈటల రాజేందర్, ధర్మపురి అర్వింద్, కె. లక్ష్మణ్, అలాగే రామచందర్ రావు పేర్లు బలంగా వినిపించాయి. ఈ క్రమంలో రామచందర్ రావును ఎంపిక చేశారు. ఆర్ఎస్ఎస్తో పాటు పలువురు సీనియర్ నేతలు కూడా ఆయన పేరును ప్రతిపాదించినట్లు సమాచారం.కాంగ్రెస్ పార్టీని ఎదుర్కోవడం, బీజేపీని బలోపేతం చేయడం, స్థానిక సంస్థల ఎన్నికలు తదితర అంశాలను దృష్టిలో ఉంచుకొని రామచందర్ రావును రాష్ట్ర అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది.