ప్రజా సమస్యలపై  అధికారుల నిర్లక్ష్యం.

ప్రజా సమస్యలపై  అధికారుల నిర్లక్ష్యం.

- ప్రజావాణికి కేవలం ముగ్గురు అధికారులే హాజరు.

- మెజార్టీ అధికారుల గైర్హాజరు. 

- జిల్లా కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్. 

- అసంతృప్తి వ్యక్తం చేస్తున్న మండల ప్రజలు.

లోకల్ గైడ్/ తాండూర్: 
ప్రజా సమస్యలపై అధికారులు నిర్లక్ష్యం చేస్తున్నారు అంటూ మండల ప్రజలు అధికారుల పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. సోమవారం నిర్వహించిన ప్రజావాణికి కేవలం ఇన్చార్జ్ ఎంపీడీవో, ఉపాధి హామీ, మహిళా సమైక్య ఇలా మూడు శాఖలకు సంబంధించిన అధికారులు మాత్రమే హాజరై, మెజార్టీ అధికారులు హాజరు కాకపోవడంతో,పలువురు అధికారులు ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారని మండల ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.ఇదిలా ఉంటే, ప్రతి సోమవారం జిల్లా వ్యాప్తంగా ఆయా మండల పరిషత్ కార్యాలయాలలో ప్రజావాణి నిర్వహించాలని జిల్లా కలెక్టర్ తెలిపినప్పటికీ, కలెక్టర్ ఆదేశాలు బేఖాతర్ చేస్తున్నారని తీవ్ర విమర్శలు గుప్పిస్తున్నారు.రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారం చేపట్టిన నాటినుండి నేటి వరకు, ప్రజా పాలనలో భాగంగా, ప్రతి సోమవారం అన్ని మండల పరిషత్ కార్యాలయాలలో ప్రజావాణిని నిర్వహించి, ప్రజల వద్దకే అధికారులు వెళ్లి, స్థానికంగా ప్రజలకు ఉన్న సమస్యలను వారి ద్వారా వినతుల రూపంలో స్వీకరించి, సత్వరమే పరిష్కరించాలని జిల్లా పాలన అధికారి ఆదేశించిన విషయం విధితమే.కానీ వీటన్నిటికి భిన్నంగా వ్యవహరిస్తూ, పలువురు అధికారులు ప్రజావాణికి రాలేకపోతున్నారని మండల ప్రజలు వాపోతున్నారు.ప్రతి సోమవారం ఉదయం 11 నుంచి మధ్యాహ్నం ఒకటి గంటల వరకు మండలంలోని అన్ని శాఖల అధికారులతో ప్రజావాణి నిర్వహించి ప్రజల సమస్యలను పరిష్కరించాలి అనే ఆదేశాలు ఉన్నప్పటికీ, ఈ నిబంధనలను ఏ ఒక్క అధికారి సక్రమంగా పాటించడం లేదని మండల ప్రజలు అధికారుల పైన అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు.... రహదారి, తాగునీరు, కరెంటు, ఆరోగ్యం, పెన్షన్లు, భూ సంబంధిత సమస్యలు, సబ్సిడీ గ్యాస్, పొలాలలో విద్యుత్ స్తంభాలు, తీగలు, కొత్త పెన్షన్లు....తదితర సమస్యలతో ప్రజావాణికి వెళ్లి తమ సమస్యలను తెలుపుదామంటే,సంబంధిత శాఖ అధికారి ఉంటాడా, ఉండడా అనే అనుమానం ప్రజల్లో నాటుపోయినట్లు పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.ఇప్పటికైనా మండలంలోని అన్ని శాఖ అధికారులు ప్రతి సోమవారం నిర్వహించే ప్రజావాణి కార్యక్రమానికి సకాలంలో హాజరై, తమకు అందుబాటులో ఉంటూ సమస్యలను సత్వరమే పరిష్కరించాలని మండల ప్రజలు ఉన్నతాధికారులను వేడుకుంటున్నారు.

Tags:

About The Author

Latest News