ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలి.
నల్లగొండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్
నల్లగొండ .లోకల్ గైడ్.
ప్రజావాణి ఫిర్యాదుల పరిష్కారం పై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్ అన్నారు ప్రజావాణి కార్యక్రమంలో భాగంగా సోమవారం అయన జిల్లా కలెక్టర్ కార్యాలయంలోని సమావేశ మందిరంలో ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.
ఈ సోమవారం మొత్తం 122 ఫిర్యాదులు రాగా, జిల్లా అధికారులకు 67 ,రెవెన్యూ శాఖకు 55 ఫిర్యాదులు వచ్చాయి.వీటిలో ఎప్పటిలాగే ఎక్కువ ఫిర్యాదులు వ్యక్తిగత విషయాలకు సంబంధించి, భూములకు సంబంధించి ,ఉద్యోగ, ఉపాధి అవకాశాలకు సంబంధించి ఉన్నాయి. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ జిల్లా అధికారులతో మాట్లాడుతూ ఫిర్యాదుల పరిష్కారంలో జాప్యం చేయవద్దని ,ప్రజావాణి ఫిర్యాదుల తో పాటు, ముఖ్యమంత్రి ఫిర్యాదులు, తదితర వాటిపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని పరిష్కరించాలని సూచించారు. స్థానిక సంస్థల ఇన్చార్జి అదనపు కలెక్టర్ నారాయణ అమిత్, స్పెషల్ కలెక్టర్ సీతారామారావు, గృహ నిర్మాణ శాఖ పీడి రాజ్ కుమార్, జిల్లా గ్రామీణ అభివృద్ధి అధికారి శేఖర్ రెడ్డి, జిల్లా అధికారులు ప్రజల వద్ద నుండి ఫిర్యాదులను స్వీకరించారు.