విద్యాభివృద్ధికి సర్కారు పెద్దపీట: మంత్రి జూపల్లి
రూ. లక్షలతో నిర్మించిన కేజీబీవీ భవనాన్ని ప్రారంభించిన మంత్రి
లోకల్ గైడ్, నాగర్ కర్నూల్ జిల్లా
తెలంగాణలో విద్యాభివృద్ధికి కాంగ్రెస్ ప్రజా ప్రభుత్వం పెద్దపీట వేస్తున్నదని పర్యాటక, సాంస్కృతిక, ఎక్సైజ్ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు అన్నారు. పాన్గల్ మండల కేంద్రంలో రూ. 85 లక్షల ఖర్చుతో నిర్మించిన కస్తూర్బా గాంధీ బాలికల విద్యాలయ భవనాన్ని మంత్రి జూపల్లి ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. విద్యార్థులకు విద్యాబుద్ధులు నేర్పి, ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాల్సిన బాధ్యత ఉపాధ్యయులపైన ఉందని అన్నారు. యువజన, రైతు, ప్రజా, పౌర సంఘాలు కూడా విద్యార్థులతో పాటు యువతను సన్మార్గంలో నడిపే బాధ్యత తీసుకుకోవాలని కోరారు. విద్య, వైద్యానికి లక్షల రూపాయిలను వెచ్చిస్తున్నారని, పిల్లలను కార్పోరేట్ కు బదులు ప్రభుత్వ బడుల్లో చేర్పించాలని, ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు వ్యాయమం, యోగా, ధ్యానం లాంటి వాటికి సమయాన్ని కేటాయించాలని సూచించారు. అంతకుముందు పాన్గల్ మండలం మల్లాయిపల్లిలోని పాఠశాలలో రోటరీ క్లబ్ ఆద్వర్యంలో రూ. 10 లక్షల ఖర్చుతో మరమ్మత్తు పనులు పూర్తి కాగా వాటిని మంత్రి ప్రారంభించారు.