ఇందిరమ్మ రాజ్యంలో నిరుపేదలకు ఇండ్లు...
పెద్దపల్లి, జూన్ ,30 * లోకల్ గైడ్
▪️తమ ప్రభుత్వం ఏర్పడిన అనతి కాలంలోనే అనేక సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలను ప్రజల ముంగటికి తెచ్చిన కాంగ్రెస్ పార్టీని రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రజలు ఆశీర్వదించలి...సుల్తానాబాద్ మండలం ఐతరాజ్ పల్లి, భూపతిపూర్ గ్రామాల్లో సోమవారం పలు సిసి రోడ్లకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేశారు. ఇందిరమ్మ ఇండ్ల మంజూరీ కి సంబంధించి ప్రొసీడింగ్స్ అందజేసి ముగ్గులు పోయడం జరిగింది...ముందుగా ఐతరాజ్ పల్లి రామాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించడం జరిగింది... ఈ సందర్భంగా మాట్లాడుతూ...ఆరు గ్యారెంటీ ల అమలుతోపాటు రైతులకు రుణమాఫీ, సన్న బియ్యం పంపిణీ, సన్నవడ్లకు బోనస్, ఇసుక ఫ్రీ, కటింగులు లేకుండా వడ్ల కొనుగోలు వంటి ఎన్నో సేవలను అందిస్తున్నట్టు చెప్పారు. అర్హులైన అందరికీ ఇందిరమ్మ ఇండ్లు మంజూరు చేస్తామని స్పష్టం చేశారు. నియోజకవర్గ ప్రజలు తన పనితీరును, ప్రభుత్వ పథకాలను చూసి కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులకు మద్దతు ఇవ్వాలని కోరారు. రాబోయే మూడున్నర సంవత్సరాల కాలంలో మరిన్ని అభివృద్ధి, సంక్షేమ పథకాలను ముందుకు తీసుకు వెళ్లేందుకు స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికార పార్టీకి చెందిన కాంగ్రెస్ ప్రజా ప్రతినిధులు ఉండాల్సిన అవసరం ఉందన్నారు.