గీతంలో జాతీయ గణాంక దినోత్సవం

గీతంలో జాతీయ గణాంక దినోత్సవం

-ముఖ్య అతిథిగా హాజరై ‘గణాంక ఆలోచన’పై ఉపన్యసించిన డాక్టర్ సీ.ఆర్.రావు

పఠాన్ చేరు, (లోకల్ గైడ్ ప్రతినిధి): గీతం స్కూల్ ఆఫ్ సైన్స్ లోని గణితం, గణాంక విభాగం ఆధ్వర్యంలో జాతీయ గణాంక దినోత్సవాన్ని సోమవారం ఘనంగా నిర్వహించారు. భారతీయ గణాంకాల పితామహుడిగా పరిగణించబడే దార్శనికుడు ప్రొఫెసర్ ప్రశాంత చంద్ర మహాలనోబిస్ జయంతిని పురస్కరించుకుని దీనిని ఏర్పాటు చేశారు. ‘75 సంవత్సరాల జాతీయ నమూనా సర్వే’ ఇతివృత్తంగా నిర్వహించిన ఈ కార్యక్రమా నికి హైదరాబాద్ కేంద్రీయ విశ్వవిద్యాలయం పూర్వ ఆచార్యుడు ప్రొఫెసర్ చిల్లరిగే రాఘవేంద్రరావు ముఖ్య అతిథిగా హాజరై ‘గణాంక ఆలోచన’ అనే అంశంపై ఆన్ లైన్ ఉపన్యాసం ఇచ్చారు. వాస్తవ ప్రపంచ అనిశ్చితులు, సంక్లిష్టతలను పరిష్కరించడం లో గణాంక విధానాల కీలక పాత్రను ఆయన ప్రస్తావించా రు. సంభవించబోయే అస్పష్టత, అప్పటికే ఉన్న అస్పష్టత వంటి వివిధ రకాల అనిశ్చితుల గురించి ప్రొఫెసర్ రావు విశదీకరించారు. సైద్ధాంతికపరంగా, ఆచరణాత్మకంగా నిర్ణయాలు తీసుకోవడంలో గణాంక ఉజ్జాయింపులు ఎలా సహాయ పడతాయో వివరించారు. సంక్లిష్టమైన గణాంక సవాళ్లను పరిష్కరించడంలో హైబ్రిడ్ పద్ధతుల విలువను కూడా ఆయన ప్రస్తావించారు. తొలుత, కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ డి.మల్లికార్జునరెడ్డి ముఖ్య అతిథిని పరిచయం చేయడంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం, డాక్టర్ అనిల్ కుమార్ వందన సమర్పణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో గీతం హైదరాబాదు అదనపు ఉప కులపతి ప్రొఫెసర్ డీ.ఎస్. రావు, స్కూల్ ఆఫ్ సైన్స్ ప్రిన్సిపాల్ డాక్టర్ ఎం.రెజా, కార్యక్రమ నిర్వాహకుడు ప్రొఫెసర్ బి.ఎం.నాయుడు, విద్యార్థి సమన్వయకర్తలు ఎం.సహస్రదీప, జి.సుష్మిక, తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News