ఎల్లమ్మకు రెండో బోనం......
By Ram Reddy
On
లోకల్ గైడ్: గోల్కొండ కోటలోని జగదాంబ ఎల్లమ్మ మహంకాళి ఆలయంలో ఆదివారం రెండో బోనం పూజ వైభవంగా జరిగింది. ఆలయ కమిటీ చైర్మన్ చంటిబాబు ఆధ్వర్యంలో పూజారి సర్వేశ్ చారి, ఈవో వసంత, సభ్యులు సంతోష్ కుమార్, ప్రదీప్ కుమార్, అనిత, శ్రీకాంత్, యాదగిరి కలిసి అమ్మవారికి అభిషేకం నిర్వహించి, ప్రత్యేక అలంకరణ చేసి హారతి సమర్పించారు.ఈ సందర్భంగా నగరంలోని వివిధ ప్రాంతాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి బోనాలు, తొట్టెలను సమర్పించారు. భక్తుల సంఖ్య ఎక్కువగా ఉండటంతో కోట కిటకిటలాడింది. అయితే, దర్శన ఏర్పాట్లు సరిగా లేకపోవడంపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల పాటు క్యూలైన్లలో నిల్చోవాల్సి రావడంతో తీవ్ర అసౌకర్యం ఎదురైందని వారు ఆవేదన చెందారు. అంతేకాకుండా, కొందరు ఆకతాయిల ప్రవర్తన వల్ల మహిళలు ఇబ్బందులు ఎదుర్కొన్నట్లు పేర్కొన్నారు.
Tags:
About The Author
Latest News
30 Jun 2025 17:23:28
నల్లగొండ జిల్లా రెవెన్యూ అదనపు కలెక్టర్ జె. శ్రీనివాస్