ఇంగ్లాండ్ పర్యటనలో పరాజయం… గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్టే!

ఇంగ్లాండ్ పర్యటనలో పరాజయం… గంభీర్‌పై ఒత్తిడి పెరుగుతున్నట్టే!

లోక‌ల్ గైడ్ : ఇంగ్లాండ్ పర్యటనను టీమ్ ఇండియా ఓటమితో ప్రారంభించింది. రెండు ఇన్నింగ్స్‌ల్లో 800కు పైగా పరుగులు చేసి, ఐదు సెంచరీలు సాధించినప్పటికీ, భారత జట్టు చివరికి ఇంగ్లాండ్ చేతిలో పరాజయానికి గురైంది.ఈ ఫలితంతో హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పై (Gautam Gambhir) తీవ్ర ఒత్తిడి పెరుగుతోందని క్రికెట్ వర్గాలు భావిస్తున్నాయి. గంభీర్ కోచ్‌గా బాధ్యతలు చేపట్టిన తర్వాత భారత జట్టు చివరి తొమ్మిది టెస్టుల్లో ఏకంగా ఏడు మ్యాచ్‌లను ఓడిపోయినట్లు వివరాలు చెబుతున్నాయి.ఈ విషయంపై మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా (Aakash Chopra) తన యూట్యూబ్ చానెల్‌లో మాట్లాడుతూ,“గంభీర్ పై ఒత్తిడి రోజు రోజుకు పెరుగుతోంది. అతడి నేతృత్వంలో టీమిండియా బంగ్లాదేశ్‌పై రెండు, ఆస్ట్రేలియాపై ఒక టెస్ట్ గెలిచింది. కానీ అదే సమయంలో న్యూజిలాండ్ పై మూడు, ఆస్ట్రేలియాపై మూడు, ఇప్పుడు ఇంగ్లాండ్ పై ఒక మ్యాచ్ ఓడిపోయింది” అని తెలిపారు.అలాగే,“ఇంగ్లాండ్ టూర్లో ఫలితాలు అనుకూలంగా రాకపోతే, గౌతమ్ గంభీర్ ప్రధాన కోచ్ పదవికీ ప్రమాదం త్రుటిలో ఉంటుంది. యాజమాన్యం కోరినట్లే సెలక్టర్లు ఆటగాళ్లను ఎంపిక చేశారు. అడిగినవారినే జట్టులోకి తీసుకున్నారు. అయినా ఫలితాలు రాకపోతే సమస్య తప్పదు” అని ఆకాశ్ చోప్రా హెచ్చరించారు.

Tags:

About The Author

Latest News