స్వర్ణాంధ్ర విజన్–2047కు సంపూర్ణ మ‌ద్ద‌తు....

స్వర్ణాంధ్ర విజన్–2047కు సంపూర్ణ మ‌ద్ద‌తు....

విజయవాడ: స్వర్ణాంధ్ర విజన్–2047ను అమలు పరచడంలో తమ పూర్తి సహకారం ఉంటుందని ఫిక్కీ జాతీయ కార్యవర్గం ప్రకటించింది. విజయవాడలో నిర్వహించిన ఫిక్కీ జాతీయ కార్యవర్గ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ సీఎం నారా చంద్రబాబు నాయుడు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పలు ప్రముఖ కంపెనీల యాజమాన్య ప్రతినిధులు హాజరయ్యారు. రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయాలు, అమలు చేస్తున్న పాలసీలు పరిశ్రమలకు అనుకూలంగా ఉన్నాయని ఫిక్కీ ప్రతినిధులు అభిప్రాయపడ్డారు. ముఖ్యంగా ఎంఎస్ఎంఈ (MSME) రంగ అభివృద్ధిలో సీఎం చంద్రబాబు ప్రదర్శిస్తున్న చొరవను ఫిక్కీ ప్రశంసించింది.

Tags:

About The Author

Latest News