యాద‌గిరిగుట్ట‌కు భారీగా భ‌క్తులు.....

యాద‌గిరిగుట్ట‌కు భారీగా భ‌క్తులు.....

యాదగిరి గుట్టలోని శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయం ఆదివారం భక్తులతో సందడిగా మారింది. వారాంతం కావడంతో అనేక ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో తరలి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. వేకువజాము నుంచే ప్రారంభమైన రద్దీ రాత్రి వరకు కొనసాగింది. మొత్తం 65,000 మంది భక్తులు పంచనరసింహుల దర్శన భాగ్యం పొందారు.  ఆలయానికి వివిధ వనరుల ద్వారా రూ. 80,11,461 ఆదాయం వచ్చినట్టు ఆలయ అధికారులు వెల్లడించారు.

Tags:

About The Author

Latest News