ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

ఉచిత పశు వైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలి

- వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరుకుడు వెంకటయ్య 

 వరంగల్ (లోకల్ గైడ్ ): వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ ఆధ్వర్యంలో రాయపర్తి మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో ఉచిత పశు వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేశారు. ఈ పశు వైద్య శిబిరాన్ని వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ చైర్మన్ నరకుడు వెంకటయ్య వైస్ చైర్మన్ సిరికొండ కృష్ణారెడ్డి తో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ వెంకటయ్య మాట్లాడుతూ వర్ధన్నపేట వ్యవసాయ మార్కెట్ పరిధిలోని మూడు మండలాలలో ఉచిత పశువైద్య శిబిరాలు ఏర్పాటు చేసుకొనుటకు ప్రభుత్వం బడ్జెట్ కేటాయించినదని తెలిపారు. ఇప్పటికే వర్ధన్నపేట, రాయపర్తి మండలాలలో ఇట్టి పశు వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామని మిగిలిన ఐనవోలు మండలంలో త్వరలోనే పశువైద్యశివరాన్ని ఏర్పాటు చేస్తామని,  ఇట్టి పశువైద్య శిబిరాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో మార్కెట్ కార్యదర్శి ఎం శ్రీనివాసరాజు, పశు వైద్యులు డాక్టర్ శృతి, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు హంయ నాయక్, మండల పార్టీ అధ్యక్షులు ఈదులకంటి రవీందర్ రెడ్డి, ప్రధాన కార్యదర్శి మహేందర్, సీనియర్ నాయకులు అశోక్, కోడం నరసింహారెడ్డి, ఎల్లయ్య, అశోక్, మార్కెట్ సిబ్బంది, రైతులు గ్రామస్తులు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News