నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభివృద్ధి 

నరేంద్ర మోడీ పాలనలో భారతదేశం అభివృద్ధి 

 బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి 

 మిడ్జిల్ జూన్ 20:(లోకల్ గైడ్):
 భారతదేశంలో నరేంద్ర మోడీ 11 సంవత్సరాల పాలనలో దేశం ఎంతో అభివృద్ధి చెందిందని నిరుపేదల అభివృద్ధి కోసం ఎన్నో సంక్షేమ పథకాలు భారతీయ జనతా పార్టీ ప్రవేశపెట్టిందని బీజేవైఎం జిల్లా అధ్యక్షులు పల్లె తిరుపతి అన్నారు. శుక్రవారం మిడ్జిల్ మండలం కొత్తూరు గ్రామంలో బిజెపి మిడ్జిల్ మండల అధ్యక్షుడు నరేష్ నాయక్ ఆధ్వర్యంలో  ప్రధానమంత్రి  నరేంద్ర మోడీ  11సంవత్సరాల సుపరిపాలన, వికసిత్ భారత్ రచ్చబండ కార్యక్రమాన్ని  నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి బీజేవైఎం      జిల్లా అధ్యక్షుడు పల్లె తిరుపతి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ  స్థానిక సంస్థల ఎన్నికల్లో ప్రతి కార్యకర్త గెలుపే లక్ష్యంగా  పనిచేయాలని ఆయన అన్నారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల గురించి గ్రామాల్లోని కార్యకర్తలు, నాయకులు ప్రజలకు వివరించాలని ఆయన అన్నారు.
ఈ కార్యక్రమంలో బూత్ అధ్యక్షుడు శివాజీ, ఎల్లయ్య, శేఖర్ లతో పాటు తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News