దివంగత ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చేతివాటం ప్రదర్శించిన దుండగులు...

దివంగత ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహావిష్కరణ కార్యక్రమంలో చేతివాటం ప్రదర్శించిన దుండగులు...

పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో వేచి చూడాల్సిందే...

 నిజామాబాద్ జిల్లా ప్రతినిధి: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని కంటెశ్వర్ బైపాస్ రోడ్డు చౌరస్తాలో దివంగత నేత ధర్మపురి శ్రీనివాస్ కాంస్య విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమం జాతీయ హోం శాఖ మాత్యులు అమిత్ షా చేతుల మీదుగా చేసిన విషయం తెలిసిందే... అయితే అక్కడికి డిఎస్ అభిమానులు కార్యకర్తలు వచ్చిన విషయం తెలిసిందే.. అయితే అదే అదునుగా భావించిన దొంగలు తమ చేతివాటాన్ని ప్రదర్శించారు..అయితే నిజామాబాద్ జిల్లా కేంద్రానికి చెందిన ముగ్గురు యువకులు దాంట్లో ఇద్దరు ఉపాధ్యాయుల బంగారు చైన్ మరియు రియల్ ఎస్టేట్ చేసే వ్యక్తి మెడలో నుండి మూడు బంగారు చైన్లు అపహరించారు... ఒక్కో బంగారు గొలుసు 18 గ్రాములు మరియు 12 గ్రాములు మరియు 15 గ్రాముల విలువచేసే బంగారు చైన్ లు పోయినట్టు బాధితులు రూరల్ పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసినట్టు తెలిపారు.. అయితే సంఘటన జరిగిన స్థలంలో సీసీ కెమెరాల కలెక్షన్లు ఊడిపోయాయో లేదా ఎవరైనా కట్ చేసారా లేదా అనేది ప్రస్తుతం ప్రశ్నార్థకంగా మారింది.. ఏదేమైనా నిన్నటి కేంద్ర హోం శాఖ మాత్యులు అమిత్ షా కార్యక్రమం ప్రశాంతంగా జరగడం పట్ల జిల్లా పోలీసు బాస్ మరియు పోలీసు అధికారులు సహకరించిన ప్రజలకు, అభిమానులకు కృతజ్ఞతలు తెలియజేసిన విషయం తెలిసిందే... కానీ పోయిన ఈ గోల్డ్ చైన్లు మరియు సీసీ కెమెరాల విషయంపై పోలీస్ అధికారులు ఏ విధంగా స్పందిస్తారో బాధితులు వేచి చూస్తున్నారు..

Tags:

About The Author

Latest News