ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ 

 ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ 

లోక‌ల్ గైడ్ :
ఆంధ్రప్రదేశ్‌ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిగా పీవీఎన్‌ మాధవ్‌ పేరు ఖరారైనట్లు బీజేపీ అధిష్టానం సోమవారం ప్రకటించింది. ఈ నేపథ్యంలో, ఏపీ బీజేపీ శాఖ కార్యాలయంలో ఆయన నామినేషన్ వేశారు. అధ్యక్ష పదవికి ఒక్కరే నామినేషన్ దాఖలు చేయడంతో, మాధవ్‌ ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది.ప్రస్తుతం మాధవ్‌ బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. గతంలో ఆయన శాసన మండలిలో బీజేపీ ఫ్లోర్ లీడర్‌గా విధులు నిర్వర్తించారు. మాధవ్ తండ్రి చలపతిరావు బీజేపీ సీనియర్ నాయకుడు కాగా, ఆయన రెండు సార్లు ఎమ్మెల్సీగా పని చేశారు. ప్రస్తుతం బీజేపీ ఏపీ అధ్యక్షురాలిగా పార్లమెంట్ సభ్యురాలు దగ్గుబాటి పురందేశ్వరి కొనసాగుతున్నారు.

Tags:

About The Author

Latest News