తెలంగాణ రాష్ట్రంలో మున్సిపల్ ఎన్నికలు నిర్వహించాలి
పట్టణ అభివృద్ధికి తోడుపాటు అందించాలి
జనగామ జిల్లా (లోకల్ గైడ్):-
సిపిఎం జనగామ పట్టణ కమిటీ సమావేశం ఎండి అజారుద్దీన్ అధ్యక్షతన గిర్నిగడ్డ ఏరియాలో సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్యఅతిథిగా ఎండి అబ్బాస్ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు సిపిఎం జనగాం జిల్లా కార్యదర్శి మోకు కనకా రెడ్డి పాల్గొని మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికలు నిర్వహించకపోవడంతో ప్రజా సమస్యలు పట్టణాల్లో పేర్కపోయినాయని ఆవేదన వ్యక్తం చేశారు. పాలకవర్గం లేకపోవడంతో-మున్సిపల్ కార్యాల చుట్టూ ప్రజలు తిరుగుతూ ఉన్నారు. స్పెషల్ అధికారులు సరిగ్గా పనిచేయకపోవడంతో పట్టణాలలో సమస్యలు పరిష్కారం కావడంలేదని అన్నారు. రిజర్వేషన్ల పేరుతో కాలయాపన చేస్తూ ప్రజా సమస్యలు గాలికి వదిలేసి కాలం గడుపుతున్నారు పట్టణాలలో పారిశుద్ధ్య సమస్యలు డ్రైనేజీ వీధిలైట్లు కోతులు కుక్కలు పందులు దోమలు దుమ్ము ధూళి వీధి దీపాలు వివిధ సమస్యలతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు ముఖ్యంగా ఇండ్ల స్థలాలు రేషన్ కార్డులు అన్ని రకాల కొత్త పెన్షన్లు రాకపోవడంతో ప్రజలు ఇబ్బంది పడుతున్నారు పట్టణ ప్రాంతాలలో పనులు దొరకక ధరలు పెరిగి విద్య వైద్యం అందగా ఇబ్బందులు పడుతున్నారు కావున ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వం స్పందించి మున్సిపల్ ఎన్నికలు నిర్వహించి పట్టణ ప్రగతికి తోడ్పడాలని అన్నారు. జనగామ పట్టణంలో కూడా పేరుకపోయిన ప్రజాసమస్యలు పరిష్కరించాలని లేని పక్షంలో సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో ఆందోళన చేపాడుదామని వారు హెచ్చరించారు ఈ కార్యక్రమంలో జోగు ప్రకాష్ సిపిఎం జనగామ పట్టణ కార్యదర్శి. బూడిద గోపి బాల్నే వెంకట మల్లయ్య. కళ్యాణం లింగం పల్లెర్ల లలిత పాముకుంట్ల చందు బొట్ల శ్రావణ్ పాము శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు.