లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి

నార్తాంప్టన్‌కు వెళ్లే డీవైడర్‌ను ఢీకొన్న కార్ – ఉజ్జ్వల్ రెడ్డి ఘటనాస్థలంలో మృతి, రిషిత్ రెడ్డి ఆసుపత్రిలో చనిపోయిన ఘటనపై తెలుగు కమ్యూనిటీ లో దిగ్భ్రాంతి

లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి

లండన్‌లో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు యువకులు మృతిచెందారు. ప్రమాదంలో మరణించిన వారు చందన ఉజ్జ్వల్ రెడ్డి (23), చందన రిషిత్ రెడ్డి (21)గా గుర్తించబడ్డారు. వీరు సోదరులు.

వీరు తమ మిత్రుడిని నార్తాంప్టన్‌లో కలవడానికి వెళ్తుండగా, కార్‌ డివైడర్‌ను ఢీకొనడంతో ప్రమాదం జరిగింది. ఈ ఘటన లండన్‌లోని డీపింగ్ ప్రాంతంలో ఆదివారం రాత్రి చోటుచేసుకుంది. ప్రమాద సమయంలో వారు ప్రయాణిస్తున్న బీఎండబ్ల్యూ కార్‌ పూర్తిగా ధ్వంసమైంది. అక్కడే ఉజ్జ్వల్‌ రెడ్డి మృతిచెందగా, రిషిత్‌ రెడ్డి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఆసుపత్రికి తరలించారు.

వీరి మృతికి కారణంగా వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ఈ విషాదకర ఘటన గురించి తెలిసిన తెలుగు కమ్యూనిటీ సభ్యులు, మిత్రులు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు.

ఉజ్జ్వల్‌ రెడ్డి గత 8 సంవత్సరాలుగా లండన్‌లో నివసిస్తున్నారు. అతను అక్కడ ఒక ఐటీ కంపెనీలో ఉద్యోగం చేస్తున్నారు. చందన రిషిత్‌ రెడ్డి విద్యార్థి. ఇటీవలే ఆయన చదువుల నిమిత్తం లండన్‌ వెళ్లారు.

పోలీసులు పూర్తి వివరాలను సేకరిస్తున్నారు. ఈ ప్రమాదం ఎలా జరిగింది, వేగం మితిమీరిందా? లేక ఇతర కారణాలా అన్న దానిపై దర్యాప్తు చేస్తున్నారు.

వీరి మృతదేహాలను స్వదేశానికి తరలించేందుకు ప్రయత్నాలు కొనసాగుతున్నాయి. ఈ విషాద ఘటన వారి స్నేహితులు, బంధువుల్లో తీవ్ర ఆవేదనను కలిగించింది.

Tags:

About The Author

Related Posts

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి