బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి

బాధిత కుటుంబాలకు పరామర్శ 

బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి

(లోకల్ గైడ్) కొడంగల్; వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున గొర్రెల మందపై గుర్తు తెలియని  టిప్పర్లు, టాంకర్లు వేగంగా దూసుకు వెళ్లడంతో  దాదాపు 90 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరికొన్ని గాయాల పాలయ్యాయి. ఘటన స్థలానికి మధు సూదన్ యాదవ్ చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులు నాందర్పూర్ కు చెందిన గిరిమి మల్కప్ప, రాయి కంటి ఎల్లప్ప కుటుంబాలు గొర్రెల పెంపకంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
అప్పులు చేసి గొర్రెల పెంపకం పై ఆధారపడ్డ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కోరారు. అప్పుల పాలైన బాధితులను ఆదుకొని అండగా నిలవాలన్నారు. లేదంటే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాములు, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి తదితరులున్నారు.

Tags:

About The Author

Latest News

మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్ మిడ్జిల్ క్రీడాకారుల గ్రీన్ నెట్‌కు లక్ష రూపాయల విరాళం  మాజీ ఎంపీపీ బరిగెల సుదర్శన్
మిడ్జిల్ జనవరి 15 (లోకల్ గైడ్):మిడ్జిల్ మండల కేంద్రంలో గత నాలుగు రోజులుగా నిర్వహిస్తున్న ఎంపీల్ –16 క్రికెట్ టోర్నమెంట్ ముగింపు కార్యక్రమంలో గురువారం మాజీ ఎంపీపీ...
కావడిగుండ్ల లో సంక్రాంతి సందడి
ఏసిరెడ్డి జనార్దన్ మరణం చాలా బాధాకరం
శ్రీజ మిల్క్ సెంటర్ ఆధ్వర్యంలో సంక్రాంతి సంబరాలు
ఆల్ ఇండియా బి బి జే వి సి బి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఆర్థిక సహాయం.
హౌసింగ్ బోర్డు విద్యానగర్‌లో అంగరంగ వైభవంగా భోగి సంబరాలు
స్నేహం ఐక్యతను పెంపొందించాలి