బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి

బాధిత కుటుంబాలకు పరామర్శ 

బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి

(లోకల్ గైడ్) కొడంగల్; వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున గొర్రెల మందపై గుర్తు తెలియని  టిప్పర్లు, టాంకర్లు వేగంగా దూసుకు వెళ్లడంతో  దాదాపు 90 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరికొన్ని గాయాల పాలయ్యాయి. ఘటన స్థలానికి మధు సూదన్ యాదవ్ చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులు నాందర్పూర్ కు చెందిన గిరిమి మల్కప్ప, రాయి కంటి ఎల్లప్ప కుటుంబాలు గొర్రెల పెంపకంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
అప్పులు చేసి గొర్రెల పెంపకం పై ఆధారపడ్డ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కోరారు. అప్పుల పాలైన బాధితులను ఆదుకొని అండగా నిలవాలన్నారు. లేదంటే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాములు, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి తదితరులున్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి