బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి

బాధిత కుటుంబాలకు పరామర్శ 

బాధిత కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలి

(లోకల్ గైడ్) కొడంగల్; వికారాబాద్ జిల్లా బొంరాస్ పేట్ మండలంలోని తుంకిమెట్ల వద్ద జాతీయ రహదారిపై బుధవారం తెల్లవారు జామున గొర్రెల మందపై గుర్తు తెలియని  టిప్పర్లు, టాంకర్లు వేగంగా దూసుకు వెళ్లడంతో  దాదాపు 90 గొర్రెలు అక్కడికక్కడే మృత్యువాత పడ్డాయి. మరికొన్ని గాయాల పాలయ్యాయి. ఘటన స్థలానికి మధు సూదన్ యాదవ్ చేరుకొని బాధిత కుటుంబాలతో మాట్లాడారు. బాధితులు నాందర్పూర్ కు చెందిన గిరిమి మల్కప్ప, రాయి కంటి ఎల్లప్ప కుటుంబాలు గొర్రెల పెంపకంతో కుటుంబాలను పోషించుకుంటున్నారు.
అప్పులు చేసి గొర్రెల పెంపకం పై ఆధారపడ్డ కుటుంబాలను సీఎం రేవంత్ రెడ్డి ఆదుకోవాలని కోరారు. అప్పుల పాలైన బాధితులను ఆదుకొని అండగా నిలవాలన్నారు. లేదంటే ఆత్మస్థైర్యం కోల్పోయి ఆత్మహత్యల పాలయ్యే ప్రమాదం ఉందన్నారు. ఈ సందర్బంగా బిఆర్ఎస్ పార్టీ నాయకులు రాములు, మాజీ సర్పంచ్ వెంకటరెడ్డి తదితరులున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి