ఎమ్మెల్యే పర్యటనను జయప్రదం చేయాలి.
నేడు మండలానికి రానున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్
తెలంగాణ (లోకల్ గైడ్)జిల్లేడు చౌదరి గూడెం కొందుర్గు; ఉమ్మడి మండల ప్రజల చిరకాల కోరిక. షాద్ నగర్ నియోజకవర్గానికి వర ప్రదాయిని లక్ష్మీదేవి పల్లి ప్రాజెక్ట్ నిర్మాణం కోసం తెలంగాణ రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల బృందంతో పాటు షాద్ నగర్ యోజకవర్గ అభివృద్ధి ప్రదాత ఎమ్మెల్యే శ్రీ.వీర్లపల్లి శంకర్ విచ్చేయుచున్నారనీ ఉమ్మడి మండల కాంగ్రెస్ పార్టీ అద్యక్షులు జిల్లేడు చౌదరి గూడెం, కొందుర్గ్ చలి వేంద్రం పల్లి రాజు, కృష్ణా రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం లాల్ పాహాడ్ చౌరస్తా వద్ద ఉదయం 10 గంటలకు రానున్నారు. ఈ మహోన్నతమైన జల యజ్ఞానికి నాంది పలకనుంది.ఇలాంటి మహోన్నత కార్యక్రమానికి శ్రీకారం చుట్టడానికి విచ్చేయుచున్న బృందం సభ్యులకు స్వాగతం పలికేందుకు భారి సంఖ్యలో ఉమ్మడి మండల ప్రజలు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, ఆయా గ్రామాల కాంగ్రెస్ పార్టీ అనుబంధ కార్యకర్తలు,కార్యదర్శులు,మహిళా నాయకులు సంఘాల సభ్యులు,మాజీ సర్పంచులు,ఎంపీటీసీలు,యువజన నాయకులు భారీ సంఖ్యలో హాజరుకావాలని కోరారు.