అక్రమ పట్టా రద్దు చేయాలని వినతి.

అక్రమ పట్టా రద్దు చేయాలని వినతి.

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న పట్టాను శాశ్వతంగా రద్దు చేయాలని బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామస్తులు సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామశివారులో సర్వే నెంబర్ 8లోని గ్రామచావిడి పరంపోగు ప్రభుత్వ భూమిని బట్వాన్ పల్లి గ్రామానికి దుర్గం ధనుంజయ అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని చుట్టు కంచె నిర్మించాడని,అదేవిధంగా ఆ కంచెకు ప్రభుత్వ విద్యుత్ స్తంభం నుండి అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తు ప్రయత్నించాడని ఆరోపించారు.ఈ అక్రమపట్టాను శాశ్వతంగా రద్దు చేసి దుర్గం ధనుంజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ను కోరారు.సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపినట్లు వారు పేర్కొన్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి