అక్రమ పట్టా రద్దు చేయాలని వినతి.

అక్రమ పట్టా రద్దు చేయాలని వినతి.

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); ప్రభుత్వ భూమిని అక్రమంగా పట్టా చేసుకున్న పట్టాను శాశ్వతంగా రద్దు చేయాలని బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామస్తులు సోమవారం బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కు వినతిపత్రం అందజేశారు.ఈ సందర్భంగా వారు మాట్లాడుతు మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి మండలం బట్వాన్ పల్లి గ్రామశివారులో సర్వే నెంబర్ 8లోని గ్రామచావిడి పరంపోగు ప్రభుత్వ భూమిని బట్వాన్ పల్లి గ్రామానికి దుర్గం ధనుంజయ అనే వ్యక్తి అక్రమంగా పట్టా చేయించుకుని ప్రభుత్వ భూమిని కబ్జా చేసుకుని చుట్టు కంచె నిర్మించాడని,అదేవిధంగా ఆ కంచెకు ప్రభుత్వ విద్యుత్ స్తంభం నుండి అక్రమంగా విద్యుత్ సరఫరా చేస్తు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తు ప్రయత్నించాడని ఆరోపించారు.ఈ అక్రమపట్టాను శాశ్వతంగా రద్దు చేసి దుర్గం ధనుంజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ ను కోరారు.సానుకూలంగా స్పందించిన సబ్ కలెక్టర్ పూర్తి విచారణ జరిపి చర్యలు తీసుకుంటామని గ్రామస్తులకు తెలిపినట్లు వారు పేర్కొన్నారు.

Tags:

About The Author

Latest News