మట్టి గణపతులను పూజించండి

కరపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే చేతుల మీదుగా ఆవిష్కరించిన శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు

మట్టి గణపతులను పూజించండి

 

 

భద్రాద్రి కొత్తగూడెం లోకల్ గైడ్ :పార్వతీదేవి అమ్మవారు శరీరం శుభ్రం చేసుకుని, నలుగు మట్టి నుండి వినాయకుడు ఉద్భవించాడని మన పురానాలు చెబుతున్నాయని భద్రాచలం కుమ్మర సంఘం, శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు అన్నారు. ఆదివారం మట్టి గణపతుల విగ్రహాలనే పూజించండి అనే కరపత్రాన్ని స్థానిక ఎమ్మెల్యే తెల్లం వెంకటరావు చేతులమీదుగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ప్రకృతిని కాపాడుకోవాల్సిన అవసరం ప్రతి ఒక్కరి పైన ఉన్నదని, ప్రకృతి ప్రళయానికి ఎవరైనా శిరస్సు వంచాల్సిందన్నారు. పర్యావరణ పరిరక్షణ భావితరాల సంరక్షణ పర్యావరణాన్ని పరిరక్షిద్దాం భావితరాలను సంరక్షిద్దామన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీ మొల్ల స్వచ్ఛంద సేవా సంస్థ భద్రాచలం సభ్యులు గంగాధర వీరయ్య, భద్రాచలం కుమ్మరి సంఘం డివిజన్ నాయకులు విజ్జిగిరి రాజా కిరణ్, గంగాధర సతీష్, సద్దనపు సత్యనారాయణ, వి. నరేష్, జల్లారపు సునీల్, సగ్గెం లక్ష్మణరావు, రెల్లి తాతారావు, కొలిచలం నవీన్, విజ్జిగిరి రవి తేజ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి