మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

మండల అధ్యక్షుడు డోకూరి ప్రభాకర్ రెడ్డి సీనియర్ నాయకులు కాసు శ్రీనివాస్ రెడ్డి

మృతుడి కుటుంబానికి ఆర్థిక సహాయం అందజేసిన కాంగ్రెస్ నాయకులు

కల్వకుర్తి  (లోకల్ గైడ్); తలకొండపల్లి మండలం లోని వెంకటాపూర్ గ్రామంలో నిర్ద వెల్లి శ్రీరాములు అనారోగ్యంతో బాధపడుతు మరణించడం జరిగింది ఇట్టి విషయాన్ని స్థానిక  కాంగ్రెస్ పార్టీ నాయకులు మాజీ సర్పంచ్ పయ్యావుల రమేష్ యాదవ్ ద్వారా తెలుసుకున్న మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు డోకూరి ప్రభాకర్ రెడ్డి  మృతుడి ఆత్మకు శాంతి చేకూరాలని 3000 వేల రూపాయలు ఆర్థిక సహాయం అందించారు మరియు కాంగ్రెస్ పార్టీ సీనియర్  నాయకులు శతాబ్ది టౌన్షిప్ ఎండి కాసు శ్రీనివాస్ రెడ్డి  మృతుడి కుటుంబ సభ్యుల ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ 4000  వేల రూపాయలు ఆర్థిక సహాయం స్థానిక నాయకుల ద్వారా అందించారు.ఈ కార్యక్రమంలో  అంజన్ రెడ్డి, మాజీ వార్డు సభ్యులు సోప్పరి రాము, గొర్రె అంజయ్య, నాయకులు డిల్లి ఆంజనేయులు, సొప్పరీ శ్రీను, రావి చెట్టి ఆంజనేయులు, సోప్పరి తిరుపతి,సోప్పరి మహేష్, గొర్రె రాములు, గొర్రె శ్రీకాంత్, తాండ్ర మహేష్ , తాండ్ర ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News