ఎరువుల షాపులు రికార్డులు పరిశీలించిన భద్రాచలం ఏడీఏ అధికారి

ఎరువుల షాపులు రికార్డులు పరిశీలించిన భద్రాచలం ఏడీఏ అధికారి

 

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల (లోకల్ గైడ్); భద్రాద్రి కొత్తగూడెం జిల్లా చర్ల మండల కేంద్ర పరిధిలో ఉన్న ఎరువుల షాపులను భద్రాచలం ఎంబీఏ అధికారి శుక్రవారం తనిఖీలు  నిర్వహించారు. ఈ తనిఖీలలో భద్రాచలం ఏడీఏ బీ సుధాకర్ రావు,  చర్ల వ్యవసాయ అధికారి  లావణ్య   ఆర్ కొత్తగూడెం, అంజనాపురం, చిన్నమిడిసిలేరు, చర్ల గ్రామాలలోని వివిధ ఎరువులు, పురుగుమందుల దుకాణాలను పరిశీలించారు. ఈ పరిశీలనలో కొంతమంది డీలర్ల వద్ద రికార్డులు సక్రమంగా నిర్వహించకపోవడం గుర్తించారు. గుర్తించిన దుకాణాలకు స్టాప్ సేల్ నోటీసులు జారీ చేసినట్లు, ఈ విషయం పై  చర్ల రైతు వేదిక నందు మండలంలోని ఇన్పుట్ డీలర్స్ అందరికి సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో  రికార్డులు, స్టాక్ రిజిస్టర్లు సక్రమంగా నిర్వహించకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేసారు. దుకాణాలలో   పెర్మిషన్ బయో ఉత్పత్తుల విక్రయం నిలిపివేయాలని, స్టాక్ రిజిస్టర్లు, రికార్డులను సక్రమంగా నిర్వహించాలని స్పష్టమైన సూచనలు చేసారు.

Tags:

About The Author

Latest News