లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ స్థల పరిశీలనకు చీఫ్ ఇంజనీర్ల బృందం రానుంది

లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ స్థల పరిశీలనకు చీఫ్ ఇంజనీర్ల బృందం రానుంది

 

కొందుర్గు: ఉమ్మడి మండల ప్రజల చిరకాల స్వప్నం అయిన లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ రూపకల్పనకు కీలకమైన అడుగు పడనుంది. షాద్‌నగర్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తున్న ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ ఆధ్వర్యంలో, రాష్ట్ర చీఫ్ ఇంజనీర్ల బృందం ప్రాజెక్ట్ స్థల పరిశీలనకు వస్తోంది.

గురువారం ఉదయం 10 గంటలకు లాల్ పాహాడ్ చౌరస్తా వద్ద ఈ బృందం చేరుకోనుంది. ఈ సందర్శనతో ప్రజల ఆశల ప్రాజెక్ట్‌కు నాంది పలికినట్లవుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రతినిధులు, మహిళా నాయకులు, సంఘాల సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన నాయకులు అందరూ బృందాన్ని స్వాగతించడానికి హాజరుకావాలని కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, షాద్‌నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.

"ఈ మహోన్నత జల యజ్ఞానికి శ్రీకారం చుట్టే వేళ ప్రతి ఒక్కరూ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా సహకరించాలి" అని కృష్ణారెడ్డి పేర్కొన్నా రు

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి