లక్ష్మీదేవిపల్లి ప్రాజెక్ట్ స్థల పరిశీలనకు చీఫ్ ఇంజనీర్ల బృందం రానుంది
By Ram Reddy
On
గురువారం ఉదయం 10 గంటలకు లాల్ పాహాడ్ చౌరస్తా వద్ద ఈ బృందం చేరుకోనుంది. ఈ సందర్శనతో ప్రజల ఆశల ప్రాజెక్ట్కు నాంది పలికినట్లవుతుందని స్థానికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
ఈ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు, గ్రామాల ప్రతినిధులు, మహిళా నాయకులు, సంఘాల సభ్యులు, మాజీ సర్పంచులు, ఎంపీటీసీలు, యువజన నాయకులు అందరూ బృందాన్ని స్వాగతించడానికి హాజరుకావాలని కొందుర్గు మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, షాద్నగర్ మార్కెట్ కమిటీ చైర్మన్ సులోచన కృష్ణారెడ్డి పిలుపునిచ్చారు.
"ఈ మహోన్నత జల యజ్ఞానికి శ్రీకారం చుట్టే వేళ ప్రతి ఒక్కరూ పాల్గొని, కార్యక్రమాన్ని విజయవంతం చేసే దిశగా సహకరించాలి" అని కృష్ణారెడ్డి పేర్కొన్నా రు
Tags:
