ఘనంగా ధనైరా సిల్క్ వస్త్రాలయం ప్రారంభం
సినీ నటి సుహాసిని
హనుమకొండ జిల్లా (లోకల్ గైడ్): హనుమకొండ తెలంగాణ జంక్షన్ ప్రాంతంలో గురువారం ధనైరా సిల్క్స్ వస్త్ర నిలయాన్ని బుల్లితెర సూపర్ స్టార్ నటి సుహాసిని, డైరెక్టర్ కార్తీక్ రెడ్డి లు ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రారంభించారు. నిర్వాహకులు, అభిమానులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ వరంగల్ చారిత్రక నగరం అని ఈ ప్రాంతంలోని ఆలయాలు, ప్రజలు తనకు ఎంతగానో నచ్చాయని అన్నారు. ధనైరా సిల్క్ యాజమాన్యం మహిళలకు ఎన్నో రకాల పట్టుచీరలను తక్కువ ధరల్లో అందిస్తున్నారని, మహిళలు మెచ్చిన పట్టు వస్త్రాలను పండుగల సమయంలో కొనుగోలు చేసేందుకు ధనైరా సిల్క్ వస్త్ర నిలయం వేదిక అవుతుందని అన్నారు. 10 రూపాయల కొనుగోలుపై 4 గ్రాముల వెండి నానం, 20 వేల కొనుగోలుపై 8 గ్రాముల వెండినానం, 50వేల కొనుగోలుపై 20 గ్రాముల వెండి నానం బహుమతిగా దనేరా సిల్క్ యాజమాన్యం ప్రత్యేకంగా మహిళలకు అందజేయనున్నారు. ఇంస్టాగ్రామ్ ఫాలోవర్స్ మహిళలకు 150 మందికి ఉచితంగా చీరలను పంపిణీ చేసినట్లు నిర్వాహకులు వంగాల భవాని దిలీప్ రెడ్డిలు తెలిపారు. పై ఆఫర్లు ఈనెల 21 నుండి ఆగస్టు 27 వరకు వినాయక చవితి పండుగ సందర్భంగా ఆఫర్లను అందజేయనున్నట్లు వారు పేర్కొన్నారు.
About The Author
