లింగంపల్లి డ్రైనేజ్ కాలువలో పడి మహిళ మృతి

లింగంపల్లి డ్రైనేజ్ కాలువలో పడి మహిళ మృతి

శేరిలింగంపల్లి ప్రతినిధి (లోకల్ గైడ్);  లింగంపల్లి పాత గ్రామానికి చెందిన మహిళ డ్రైనేజ్ కాలువలో పడి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం..మృతురాలు తుర్పటి యాదమ్మ (45) జీహెచ్‌ఎంసీ కార్మికురాలు, ఆగస్టు 20వ తేదీ రాత్రి 10.30 గంటల సమయంలో నాగులమ్మ గుడి సమీపంలో కూరగాయల మార్కెట్ వెనుక ఉన్న డ్రైనేజ్ కాలువలో పడి మృతి చెందింది. మృతురాలు మద్యపానం అలవాటు కలిగి ఉండేదని, సహజవిసర్జన కోసం వెళ్లిన సమయంలో మత్తులో జారి కాలువలో పడి ఉండవచ్చని పోలీసులు ప్రాథమికంగా భావిస్తున్నారు. ఈ ఘటనపై మృతురాలి కుమారుడు తుర్పటి కుమార్ (26) పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తల్లి మృతికి ఎవరిపైనా అనుమానం లేదని ఆయన తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి