కన్నాయిగూడెం గ్రామపంచాయతీలో బురద నీరే గతి? 

ఆరోగ్య సమస్యలతో గ్రామం విలవిల! 

కన్నాయిగూడెం గ్రామపంచాయతీలో బురద నీరే గతి? 

భద్రాద్రి కొత్తగూడెం అశ్వారావుపేట (లోకల్ గైడ్); మండల పరిధిలోని కన్నాయిగూడెం గ్రామపంచాయతీ గోపన్న గూడెం గ్రామంలో గత కొంతకాలంగా బురద నీటితోనే కాలం వెళ్లదీస్తున్నామని, పంచాయతీ కార్యదర్శికి, ప్రత్యేక అధికారులకు ఎన్నిసార్లు విన్నవించినా ఫలితం లేకపోయిందని, వెంటనే సమస్యను పరిష్కరించాలని గోపన్నగూడెం గ్రామస్తులు కోరుతున్నారు. గ్రామపంచాయతీ పరిధిలోని గోపన్న గూడెం గ్రామంను రెండు భాగాలుగా విభజించి రెండు బోర్లు, మోటార్లు, రెండు ట్యాంకులను ఏర్పాటు చేశారని, గోపన్నగూడెం దిగువ భాగంలో ఉన్న ప్రాంతానికి ఒక బోరు ట్యాంకు నల్లా కనెక్షన్లు ఇచ్చారని, బోరు దిగువ భాగంలో ఉండటం వలన, పైన ఉన్న కేసింగ్ పైపు పగిలిపోయి సంవత్సర కాలంగా వర్షం పడిన ప్రతిసారి వరద నీరు చెత్తాచెదారం మొత్తం బోరులోకే వెళుతుందని, దీంతో వాటర్ ట్యాంక్ లోకి బురద నీరే వస్తుందని, ఈ బురద నీరు ఉపయోగించడం వలన గ్రామంలో అనేక ఆరోగ్య సమస్యలు తలెత్తుతున్నాయని, ఈ మధ్యకాలంలో మలేరియా టైఫాయిడ్ అనేక ఆరోగ్య సమస్యలతో సతమతమవుతున్నామని, ఇప్పటికైనా ప్రభుత్వం ఉన్నతాధికారులు తగు చర్యలు తీసుకొని బురద నీరును అరికట్టి, మంచినీటిని అందించాలని గోపన్నగూడెం గ్రామ ప్రజలు కోరుతున్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి