ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. 

ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు. 

మంచిర్యాల జిల్లా ప్రతినిధి (లోకల్ గైడ్); మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి పట్టణంలోని ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో వినాయక చవితి వేడుకలు అంగరంగ వైభవంగా నిర్వహించారు.వినాయక చవితి పురస్కరించుకొని బెల్లంపల్లి ఎమ్మెల్యే గడ్డం వినోద్ స్వయంగా లంబోధరున్ని ప్రతిష్టించి ప్రత్యేక పూజలు చేశారు.ఈ సందర్భంగా రాష్ట్ర,నియోజకవర్గ ప్రజలందరు సుఖసంతోషాలతో ఆయురారోగ్యాలు,పాడిపంటలతో అష్ట ఐశ్వర్యాలతో ఉండాలని దేవుని ప్రార్థించారు.ఆ విఘ్నేశ్వరుని ఆశీర్వాదంతో ప్రజల విఘ్నాలు తొలగాలని విఘ్నేశ్వరుని ప్రార్థించారు.విఘ్నాలు తొలగించే గణనాధుని ప్రజలంతా తమ ఇండ్లలో భక్తిశ్రద్ధలతో ప్రార్థించాలని,తగిన జాగ్రత్తలు పాటిస్తు తమ ఇండ్లలో గణేష్ నవరాత్రులు జరుపుకుని లంబోదరుని ఆశీర్వాదం పొందాలని ఆకాంక్షించారు.అనంతరం పట్టణంలోని బాబు క్యాంపు బస్తీలో గల అంబేద్కర్ కమ్యూనిటీ హాల్ పరిసర ప్రాంతాలను సందర్శించారు. కమ్యూనిటీ హాలు చుట్టూ ప్రహరీ గోడ అదేవిధంగా ప్రజలకు అందుబాటులో ఉండే పలు నిర్మాణాలను చేపట్టేందుకు జిల్లా కలెక్టర్ సంబంధిత శాఖల అధికారులతో మాట్లాడి నిర్మాణం చేపట్టే విధంగా నిధులు సమీకరించేందుకు కృషి చేస్తానని స్థానిక దళిత సంఘాల ఐక్యవేదిక నాయకులకు తెలిపారు.ఈ కార్యక్రమంలో నాయకులు మత్తమారి సూరిబాబు,ముచ్చర్ల మల్లయ్య,చిలుముల శంకర్ రత్నం ప్రదీప్,బండి రాము,దావ రమేష్,నిజాం,బండి లక్ష్మణ్,చిప్ప మనోహర్ తదితరులు పాల్గొన్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి