కమాల్ పూర్ లో త్రాగునీటికి కష్టాలు

కమాల్ పూర్ లో త్రాగునీటికి కష్టాలు

- తాగునీటి కోసం కిలోమీటర్ దూరం నడుస్తున్న ప్రజలు. - అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం. - నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాం - ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్  - కమల్ పూర్ గ్రామంలోని ఓ కాలనీ వాసుల ఆవేదన.

 

లోకల్ గైడ్/తాండూర్: యాలాల్ మండల పరిధిలోని కమల్ పూర్ గ్రామంలోని బోయిని కాలనీలో గత  నాలుగు నెలలుగా త్రాగునీరు అందక ప్రజలు దాహర్తితో అల్లాడిపోతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా వున్నాయి... యాలాల మండలం కమల్‌పూర్ గ్రామంలోని బోయిని కాలనీలో నాలుగు నెలలుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.దీంతో కాలనీ ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులతో పూట గడుపు తున్నారు.ప్రతి రోజు దూరప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకోవడం ప్రజలకు భారంగా మారింది.నీటి కోసం బాటిళ్లు, డబ్బాలతో కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.త్రాగునీటి సమస్య గురించి కాలనీ ప్రజలు పలుమార్లు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి సంపత్ కుమార్ కి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకొక పోగా విధులు పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి,నీరు సరఫరా చేసి కమాల్ పూర్ ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Related Posts

Latest News

కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం కూకట్ పల్లి బాలానగర్ డివిజన్‌లో ఇంద్రనగర్ బస్తీ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికలు – సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం
  కూకట్ పల్లి లోకల్ గైడ్ న్యూస్ : కూకట్ పల్లి నియోజకవర్గం బాలానగర్ డివిజన్ పరిధిలోని ఇంద్రనగర్ బస్తీ లోకల్ వెల్ఫేర్ అసోసియేషన్ ఎన్నికల్లో –
కూకట్పల్లి–బాలానగర్ ఇంద్రనగర్ బస్తీ ఎన్నికలు | సి హెచ్ గిరి సాగర్ ప్యానల్ ఘన విజయం | అధికారిక ఫలితాలు త్వరలో
జూబ్లీహిల్స్ ఎమ్మెల్యే నవీన్ యాదవ్ ను సన్మానించిన ఓయూ జేఏసీ చైర్మన్ కొత్తపల్లి తిరుపతి
ఓవర్ లోడ్ వాహనాలతో పొంచి ఉన్న ప్రమాదం.
రంగారెడ్డి జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం : 21 మంది మృతి
గురుకుల విద్యార్థినులపై పోలీసుల దౌర్జన్యం – షాద్‌నగర్‌లో ఉద్రిక్తత
ఫోరెన్సిక్ సైన్స్‌ పై న్యాయవాదులకు అవగాహన తప్పనిసరి