కమాల్ పూర్ లో త్రాగునీటికి కష్టాలు

కమాల్ పూర్ లో త్రాగునీటికి కష్టాలు

- తాగునీటి కోసం కిలోమీటర్ దూరం నడుస్తున్న ప్రజలు. - అధికారుల నిర్లక్ష్యంపై ప్రజల ఆగ్రహం. - నీటి సమస్య పరిష్కరించకపోతే ఆందోళన చేపడతాం - ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన పంచాయతీ కార్యదర్శి సంపత్ కుమార్  - కమల్ పూర్ గ్రామంలోని ఓ కాలనీ వాసుల ఆవేదన.

 

లోకల్ గైడ్/తాండూర్: యాలాల్ మండల పరిధిలోని కమల్ పూర్ గ్రామంలోని బోయిని కాలనీలో గత  నాలుగు నెలలుగా త్రాగునీరు అందక ప్రజలు దాహర్తితో అల్లాడిపోతున్నారు.ఇందుకు సంబంధించి పూర్తి వివరాలు ఇలా వున్నాయి... యాలాల మండలం కమల్‌పూర్ గ్రామంలోని బోయిని కాలనీలో నాలుగు నెలలుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోయింది.దీంతో కాలనీ ప్రజలు నీటి కోసం తీవ్ర ఇబ్బందులతో పూట గడుపు తున్నారు.ప్రతి రోజు దూరప్రాంతాల నుంచి తాగునీరు తెచ్చుకోవడం ప్రజలకు భారంగా మారింది.నీటి కోసం బాటిళ్లు, డబ్బాలతో కిలోమీటర్ల దూరం నడవాల్సి వస్తోందని అసంతృప్తి వ్యక్తం చేశారు.త్రాగునీటి సమస్య గురించి కాలనీ ప్రజలు పలుమార్లు పంచాయతీ కార్యాలయానికి వెళ్లి కార్యదర్శి సంపత్ కుమార్ కి ఫిర్యాదు చేసిన ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకొక పోగా విధులు పట్ల పూర్తిగా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తూ ప్రజా సమస్యలను గాలికి వదిలేస్తున్నారు.ఇప్పటికైనా ఉన్నతాధికారులు వెంటనే స్పందించి,నీరు సరఫరా చేసి కమాల్ పూర్ ప్రజల దాహార్తిని తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు.

Tags:

About The Author

Latest News

సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం సీఎం ప్రజావాణి” కి బ్యాటరీ వాహనం
      లోకల్ గైడ్  : ప్రజల సమస్యలను నేరుగా వినిపించే వేదికగా ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించిన “సీఎం ప్రజావాణి” కార్యక్రమం
అన్నారం రైతుల పంట నష్టంపై మంత్రి వివేక్ వెంటనే స్పందన
అసెంబ్లీ లో బి.సి.లకు 42 శాతం రిజర్వేషన్లు కల్పిస్తూ అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసిన సందర్భంగా
లండన్‌లో ఘోర రోడ్డుప్రమాదం: హైదరాబాద్‌కు చెందిన ఇద్దరు సోదరులు మృతి
సీఎం రేవంత్ రెడ్డి వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొన్న  జిల్లా కలెక్టర్ మరియు జిల్లా ఎస్పీ మరియు అధికారులు
భారీ వర్షాల సమయం లో చెరువులకు నష్టం జరగకుండా చర్యలు తీసుకోవాలి సి యం రేవంత్ రెడ్డి
ప్రజావాణికి జిల్లా అధికారులు విధిగా హాజరు కావాలి - ఆదేశించిన కలెక్టర్ టి.వినయ్ కృష్ణారెడ్డి