బసవతారక నగర్ వాసులను ఆదుకుంటం
-ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న
శేరిలింగంపల్లి, (లోకల్ గైడ్ ప్రతినిధి): శేరిలింగంపల్లి నియోజకవర్గం గచ్చిబౌలి డివిజన్ పరిధిలోని గౌలిదొడ్డి గల బసవతారక నగర్ లో సర్వే నెం 36, 37 లోని ప్రభుత్వ భూమిలో గత 30 సంవత్సరాలగా పేదల నిర్మించుకుని నివాసం ఉంటున్న గుడిసెలను స్థానిక ప్రజా ప్రతినిధులు తొలగించి, అక్రమంగా కబ్జా చేస్తున్నారని స్థానిక బిసి నాయకుల అధ్వరంలో బాధితులు ఎమ్మెల్సీ తీన్మార్ మల్లన్న ను కలిసి తమ సమస్యలను పరిష్కరించాలని కోరారు. ఈ సందర్బంగా తీన్మార్ మల్లన్న మాట్లాడతూ.. అక్రమణ గురైన ఇంటి స్థలాలను తిరిగి బాధితులకు రేపటి వరకు ఇవ్వాలి అని కబ్జాదారులును హెచ్చరించారు. అదే విధంగా ఇవ్వని పక్షంలో తాను ఆ ప్రాంతానికి స్వయంగా వచ్చి పేదలకు అందాల్సిన ఇండ్ల స్థలాలను ఇప్పిస్తానాని బాధితులకు భరోస ఇచ్చారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ బిసి పోలీటికల్ జెఏసి కోఆర్డినేషన్ కమిటీ చైర్మన్ సుదగాని హరిశంకర్ గౌడ్, బిసి సంఘం నాయకుల బి. కృష్ణా పటేల్, పోగుల నర్సింహ్మూలు, మేగని నర్సింగ్ రావు, బాధితులు కొరగాని యాదమ్మ, జి జానకమ్మ, షేక్ ఖాజాబి, బల్ల శశికల, తదితరులు పాల్గొన్నారు.