హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ

బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేటలో శాశ్వత పరిష్కార చర్యలకు అధికారులకు ఆదేశాలు

హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ

హైదరాబాద్‌లో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంపు ప్రాంతాలను ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి ఆదివారం ఆకస్మికంగా పరిశీలించారు. అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రభావిత ప్రాంతాల్లో స్థానికులను కలుసుకొని సమస్యలు తెలుసుకున్నారు. బుద్ధనగర్‌లో డ్రైనేజీ కాలువ ఎత్తు సమస్య, బాల్కంపేటలో నీటిముగింపు సమస్యలు, గంగూబాయి బస్తీకుంట ఆక్రమణలపై వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరదలకు శాశ్వత పరిష్కారం చూపాలని సూచించారు. 7వ తరగతి చదువుతున్న జశ్వంత్ అనే బాలుడి సమస్యలు విని, భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితులు రాకుండా చర్యలు తీసుకుంటామని భరోసా ఇచ్చారు. GHMC, హైడ్రా కమిషనర్లకు తక్షణ ప్రణాళికలు సిద్ధం చేయాలని సీఎం ఆదేశించారు.

లోకల్ గైడ్  హైదరాబాద్ : హైదరాబాద్ నగరంలో భారీ వర్షాల కారణంగా వరదలతో ముంచెత్తుతున్న ప్రాంతాల్లో ముఖ్యమంత్రి శ్రీ ఎ. రేవంత్ రెడ్డి గారు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఇటీవల తక్కువ సమయంలో విపరీతమైన వర్షం కురవడం, పలుచోట్ల వరదలు ముంచెత్తుతున్న ప్రాంతాలను క్షేత్రస్థాయిలో తనిఖీ చేసిన ముఖ్యమంత్రి గారు అలాంటి ప్రాంతాల్లో శాశ్వత పరిష్కార చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు.

 

 అమీర్‌పేట్ బుద్ధనగర్, మైత్రివనం, బాల్కంపేట తదితర ప్రాంతాల్లో వరద ముంపుతో ప్రభావిత కాలనీలను ముఖ్యమంత్రి గారు ఆదివారం ఆకస్మిక సందర్శించి పరిశీలించారు. బుద్ధనగర్‌లో వరద నీటి డ్రెయిన్ సిస్టమ్‌ను పరిశీలించి అక్కడే అధికారులకు తగిన సూచనలు చేశారు.

 

బాల్కంపేట ముంపు ప్రభావిత ప్రాంతంలో తలెత్తుతున్న సమస్యలను హైడ్రా కమిషనర్, ఇతర అధికారులను అడిగి తెలుసుకున్నారు. బుద్ధనగర్ ప్రాంతంలో కాలనీ రోడ్డు కంటే డ్రైనేజీ కాలువ ఎక్కువ ఎత్తులో ఉండటంతో ఇరుకుగా మారి వరద తీవ్రత పెరుగుతోందని గమనించిన ముఖ్యమంత్రి గారు వెంటనే తగిన చర్యలు చేపట్టాలని ఆదేశించారు.

 

 ఆ కాలనీకి పక్కనే గంగూబాయి బస్తీకుంటను సందర్శించి ముఖ్యమంత్రి గారు అధికారులకు పలు సూచనలు చేశారు. బస్తీకుంటను కొంతమంది పూడ్చేసి పార్కింగ్ కోసం వినియోగిస్తున్నారని స్థానికులు కొందరు ముఖ్యమంత్రి గారికి ఫిర్యాదు చేశారు.

 

 ఆ ప్రాంతంలో ప్రత్యేక ట్రంక్ లైన్ ఏర్పాటు చేసి వరద సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని, అందుకు వెంటనే ప్రణాళికలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. ఇటీవల పలు సందర్భాల్లో వరద నీరు నిలిచిన మైత్రీవనం వద్ద పరిస్థితిని పరిశీలించారు. స్థానికుల నుంచి వివరాలను అడిగి తెలుసుకున్నారు.

 

 అమీర్ పేట బుద్ధనగర్‌లో జశ్వంత్ అనే బాలుడితో ముఖ్యమంత్రి గారు వివరాలు ఆరా తీశారు. బాలుడిని వెంట తీసుకుని ఆ ప్రాంతాన్ని కలియతిరిగారు. తాను 7 వ తరగతి చదువుతున్నానని, వరద నీరు ఇంట్లోకి వచ్చి పుస్తకాలు తడిసిపోయాయని ఆ బాలుడు ముఖ్యమంత్రి గారికి వివరించారు. భవిష్యత్తులో వరద పరిస్థితులు తలెత్తకుండా శాశ్వత పరిష్కారం చూపిస్తానని ముఖ్యమంత్రి గారు బాలుడికి ధైర్యం చెప్పారు. 

 

ఆయా ప్రాంతాలను పరిశీలించిన తర్వాత ముఖ్యమంత్రి గారు తీసుకోవలసిన చర్యలపై జీహెచ్ఎంసీ కమిషనర్, హైడ్రా కమిషనర్లకు, సంబంధిత అధికారులకు పలు ఆదేశాలు జారీ చేశారు.

Tags:

About The Author

Latest News

IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ IPL 2026లో ఆడతానో లేదో డిసెంబర్‌లో చెబుతా – ధోనీ
లోకల్ గైడ్ : మహేంద్ర సింగ్ ధోనీ, భారత క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్‌లలో ఒకరైన ఆయన, అంతర్జాతీయ క్రికెట్‌కు 2020లోనే వీడ్కోలు పలికినా, ఇండియన్...
తిరుమలలో భక్తుల రద్దీ తగ్గింది – సర్వదర్శనానికి 8 గంటల సమయం మాత్రమే
సినీ హీరో రానా దగ్గుబాటి బెట్టింగ్ యాప్స్ ప్రచారం కేసులో ఈరోజు అమలులో ఉన్న ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) విచారణకు హాజరయ్యారు
2024 ఎన్నికల్లో ఓటరు మోసాలపై రాహుల్ గాంధీ సంచలన ఆరోపణలు – ఐదు ప్రధాన రకాల మోసాల జాబితా
భూమి లోతుల్లో పుట్టిన వజ్రాల కథ – ఆభరణాలకే కాదు, పరిశ్రమలకు కూడా ఆభరణం
హైదరాబాద్‌లో వరద ముంపు ప్రాంతాలపై సీఎం రేవంత్ ఆకస్మిక తనిఖీ
వంగవీడులో 630 కోట్ల జవహర్ ఎత్తిపోతల పథక శంకుస్థాపన – మంత్రి కోమటి రెడ్డి