బీడీ వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం...
By Ram Reddy
On
భయాందోళనలో కాలనీవాసులు...
నిజామాబాద్: (లోకల్ గైడ్) నిజామాబాద్ జిల్లా కేంద్రంలోని నాగారం బీడి వర్కర్స్ కాలనీలో చిరుత సంచారం స్థానికంగా కలకలం రేపింది. ఒకపక్క ఊర పండగ సంబరంగా జరుపుకుంటుంటే మరోపక్క చిరుత సంచారంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు.. నాగారం 300 క్వార్టర్స్ ప్రజలు సాయంత్రం 6.55 నిమిషాల ప్రాంతంలో చిరుత పులి కనబడటంతో భయందోళనకు గురయ్యారు. స్థానికంగా 300 క్వార్టర్స్ వద్ద వాటర్ ట్యాంక్ వద్ద కనబడంతో ప్రజలు నిజామాబాద్ నార్త్ రెంజ్ ఫారెస్ట్ ఆఫిసర్ సంజయ్ గౌడ్ కు సమాచారం ఇచ్చారు. చిరుత సంచారం వాస్తవమని అన్నారు. ఆటవి శాఖ సిబ్బందిని స్థానికంగా అనవాళ్లు సేకరిస్తున్నామని తెలిపారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వారు సూచించారు..
Tags:
About The Author

Latest News
14 Jul 2025 11:42:17
2004- 2006 విద్యా సంవత్సరంలో విశ్వ వికాస్ జూనియర్ కళాశాలలో బైపీసీ చదివిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం